-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కొలంబో, మార్చి 13: రెండు టెస్టులు నిషేధం విధించడంపై దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 11 వికెట్ల తేడాతో ఈ సూపర్ బౌలర్ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో రబడ తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోలేక తనతోపాటు జట్టును కూడా తీవ్రంగా నష్టపరిచాడు.
ఢిల్లీ, మార్చి 13: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియెల్లీ వాట్ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 2014లో భారత్ పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని ట్విట్టర్ ద్వారా పెళ్లి ప్రపోజల్ చేసింది తనే. ఇపుడు ఆమె గురించి ఎందుకంటే.. త్వరలో ముక్కోణపు టీ-29 సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. భారత్కు వచ్చే ఇంగ్లాండ్ జట్టులో డేనియెల్లీ సభ్యురాలు.
న్యూఢిల్లీ, మార్చి 13: పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు, ఫిక్సింగ్, హత్యాయత్నం, గృహహింస తదితర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత ఫాస్ట్ మీడియం రైట్ ఆర్మ్ బౌలర్ మహ్మద్ షమీకి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి ఊహించని మద్దతు లభించింది. తనకు తెలిసిన మహ్మద్ షమీ అలాంటోడు కాదని, చాలా గొప్ప వ్యక్తి అంటూ కెప్టెన్ కూల్ కితాబిచ్చాడు.
కోల్కతా, మార్చి 13: తన భార్యను లైంగికంగా వేధించినట్లు, అమెపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీం ఇండియా మీడియం ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్కతా పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే షమీ భార్య హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షమీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు అతని మొబైల్ ఫోన్ని సీజ్ చేశారు.
కోల్కతా, మార్చి 13: తన భర్త టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై చేసిన సంచలన ఆరోపణల తర్వాత తరుచూ వార్తల్లో నిలుస్తున్న హసీన్ జహాన్..తాజాగా మీడియాపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. తనకు విలేఖరుల నుంచి ఎదురవుతున్న పలు ప్రశ్నల నేపథ్యంలో జహాన్ అతిగా ప్రవర్తించింది. నగరంలోని సెయింట్ సెమాస్టియన్స్ స్కూల్ ఆవరణలో జర్నలిస్టులు ఆమెను వీడియో చిత్రీకరించే క్రమంలో కెమెరా లాక్కుని పగలగొట్టింది.
జైపూర్, మార్చి 13: రానున్న ఐపీఎల్లో పాల్గొనే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్గా మాజీ క్రికెటర్ అమోల్ మజుందార్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం మంగళవారం వెల్లడించింది. క్రికెట్లో బాగా రాటుదేలిన అనుభవం కలిగిన మజుందార్ తమ టీమ్లో యువ క్రికెటర్లకు, తద్వారా జట్టుకు చాలా మేలు జరుగుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది.
కోల్కతా, మార్చి 13 : విరాట్కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సహచర టీం సభ్యులు, ‘గ్రీన్ జర్సీలు’ ధరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘గోగ్రీన్’ పిలుపు మేరకు, వీరంతా గ్రీన్ జర్సీలు ధరిస్తారు. వచ్చే ఏప్రిల్ 15న జరిగే రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో ఈ ‘గ్రీన్ జర్సీలు’ ధరించి ఆడతారు.
న్యూఢిల్లీ, మార్చి 13: అఖిల భారత టెన్నిస్ అసోసియేన్ (ఎఐటిఏ), సంస్థాపరంగా నెలకొన్న ఉదాసీనతకు చరమగీతం పాడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని ప్రైవేటు అకాడమీలను ఏకీకృత నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. వీటివల్ల, పెడరేషన్ వద్ద రిజిస్టర్ చేసుకున్న కేంద్రాలు మాత్రమే, వివిధ వయోగ్రూపులకు సంబంధించిన క్రీడలను నిర్వహించే అవకాశం ఉంటుంది.
వడోదర, మార్చి 12: ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన వనే్డ మ్యాచ్లో టీమిండియా మహిళా జట్టు క్రికెటర్ పూజా వస్త్రాకర్ అరుదైన రికార్డును సాధించింది. వడోదర రిలయన్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వనే్డ మ్యాచ్లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన పూజా 9వ డౌన్ లేదా అంతకంటే తక్కువ స్థాయిలో బ్యాటింగ్కి దిగి అర్ధ సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు సాధించింది.
వడోదర, మార్చి 12: భారత్తో ఇక్కడి రిలయన్స్ స్టేడియంలో సోమవారం జరిగిన ఐసీసీ మహిళల చాంపియన్షిప్ వనే్డ ఇంటర్నేషనల్ మూడు మ్యాచ్లలో భాగంగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసిస్ జట్టులో ఓపెనర్ అజేయ సెంచరీతో భారత్ను 32.1 ఓవర్లలోనే కట్టడి చేసింది.