-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
సెంచూరియన్, జనవరి 16: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాచ్లో 25 శాతం కోత పడింది. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు సోమవారం జరిగిన ఆట సందర్భంగా కోహ్లీ ఐసీసీ కోడ్ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.
న్యూఢిల్లీ, జనవరి 16: ఇంతవరకు క్రీడా వార్తల ప్రసారానికి కేవలం వివిధ చానెళ్లపైనే ఆధారపడిన భారత క్రీడాభిమానులకు శుభవార్త. వివిధ క్రీడలకు సంబంధించిన సమస్త సమాచారంతోపాటు 24 గంటలపాటు వివిధ క్రీడలపై కామెంటరీలు వినిపించేందుకు ఇంటర్నెట్ ఆధారిత రేడియో కార్యక్రమాలు మన ముందుకు రానున్నాయి.
లూంపూర్, జనవరి 16: భారత మిక్సిడ్ డబుల్స్ జంట ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కిరెడ్డి 350,000 అమెరిన్ డాలర్ల మలేషియా మాస్టర్స్ టోర్నీలో నిరాశపరిచారు. ఏడో సీడ్కు అయిన హాంకాంగ్ జంట లీ చున్ హై రెజినాల్డ్, చౌహా హొయ్ వహతో సోమవారం జరిగిన అంతర్జాతీయ పోటీలో 18-21, 27-21 తేడాతో అపజయం పాలయ్యారు.
మెల్బోర్న్, జనవరి 16: ప్రపంచ మాజీ చాంపియన్లు మరియా షరపోవా, ఏంజిలీక్యూ కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. అయితే, మెల్బోర్న్లో వాతావరణం చాలా వేడిగా ఉండడంతో వారు రెండో రౌండ్లోకి వెళ్లడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది.
మెల్బోర్న్: ఈ ఏడాది మొదటి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ విందుకు మెల్బోర్న్ సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలై, ఈనెల 28వ తేదీతో ముగిసే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ కోసం అటు టెన్నిస్ స్టార్లు, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెన్నిస్ టోర్నమెంట్స్కు సహజంగానే విశేష ఆదరణ ఉంటుంది. ఇక గ్రాండ్ శ్లామ్ టోర్నీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సెంచూరియన్, జనవరి 14: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ మురళీ విజయ్ని మినహాయిస్తే, టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలంకాగా, భారత జట్టును ఆదుకునే బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న కెప్టెన్ కోహ్లీ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 335 పరుగులకు ఆలౌట్కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
మెల్బోర్న్, జనవరి 14: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను 0-4 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ వనే్డ సిరీస్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి వనే్డలో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ జాసన్ రాయ్ రికార్డు సెంచరీ నమోదు చేయగా, టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చాకున్నాడు.
ఢాకా, జనవరి 14: ఇటీవల కాలంలో విఫలవుతున్న బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ జట్లకు మళ్లీ పుంజుకొనే అవకాశం లభించనుంది. సోమవారం నుంచి ఇక్కడ ప్రారంభమయ్యే ముక్కోణపు వనే్డ టోర్నమెంట్లో ఈ మూడు జట్లు పోరాడనున్నాయి. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్కు తగిన విధంగా సమాయత్తమయ్యేందుకు ఈ టోర్నీని తొలి అడుగుగా క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
మెల్బోర్న్: ఎప్పటి మాదిరిగానే నిప్పులు చెరిగిన ఎండ ప్రతి ఒక్కరినీ అల్లాడించనున్నాయ. దీని ప్రభావం ఆస్ట్రేలియా ఓపెన్లోనూ కనిపించడం ఖాయం. ఈ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ప్రేక్షకులు కూడా మ్యాచ్లను చూసేందుకు పొటెత్తుతారు. అయతే, మండుతున్న ఎండలు ప్రతిసారీ ఆస్ట్రేలియా ఓపెన్ను వెంటాడుతునే ఉన్నాయ. టోర్నమెంట్ జరిగే సమయంలో ఎండలు మండిపోవడంతో చాలా మంది క్రీడాకారులు బెంబేలెత్తిపోతారు.
మెల్బోర్న్: టెన్నిస్ రంగంలో గ్రాండ్ శ్లామ్స్లోనేగాక, మరే ఇతర టోర్నీలోనూ లేనంత ప్రైజ్మేనీ ఆస్ట్రేలియా ఓపెన్లో ఉంటుంది. ఇటీవలే ప్రైజ్మనీ మొత్తాన్ని 40 మిలియన్ డాలర్లకు పెంచారు. పురుషులు, మహిళల విభాగాల్లో టైటిళ్లను సాధించిన వారికి చెరి 3.1 మిలియన్ డాలర్లు లభిస్తాయి. మొదట్లో ఈ రెండు విభాగాల్లో విజేతకు లభించే మొత్తాలు వేరువేరుగా ఉండేవి.