-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇండోర్, సెప్టెంబర్ 25: ఆస్ట్రేలియా స్పిన్నర్ అష్టన్ అగర్ స్వదేశానికి బయలుదేరనున్నాడు. చేతి వేలికి గాయం కావడంతో, ప్రస్తుత టూర్లో మిగతా మ్యాచ్ల్లో ఆడే అవకాశం లేని ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ చికిత్స నిమిత్తం ఆస్ట్రేలియా వెళతాడు. బౌండరీకి దూసుకెళుతున్న బంతిని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు అతని వేలికి గాయమైంది. దీనితో అతను డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వనే్డ ఇంటర్నేషనల్స్కు టీమిండియాను జాతీయ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్కు చోటు కల్పించారు. నిజానికి ఈ సిరీస్ మొదటి మూడు వనే్డలకు అక్షర్ ఎంపికయ్యాడు. కానీ, చెన్నైలో మొదటి వనే్డ ప్రారంభానికి ముందు అక్షర్ గాయపడడంతో, అతని స్థానంలో జడేజాకు తీసుకున్నారు.
ఇండోర్, సెప్టెంబర్ 25: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటీపడుతున్నట్టు కనిపిస్తున్నది. ఆదివారం జరిగిన మూడో వనే్డను గెల్చుకోవడం ద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ కెప్టెన్సీలో భారత్కు ఇది వరుసగా తొమ్మిదో విజయం.
క్రైస్ట్చర్చ్, సెప్టెంబర్ 25: భారత్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తొలి విడతగా తొమ్మిది మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్లో జరిగిన ఐసిసి చాంపియన్షిప్లో విఫలమైన ఆల్రౌండర్ జిమీ నీషమ్, బ్యాట్స్మన్ నీల్ బ్రూమ్కు జట్టులో చోటు దక్కలేదు. కేన్ విలియమ్సన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
బెంగళూరు, సెప్టెంబర్ 25: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరిగే నాలుగో వనే్డను వర్షం భయపెడుతున్నది. రాగల 24 నుంచి 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కర్ణాటక వాతావరణ శాఖ ప్రకటించడంతో, మ్యాచ్ సజావుగా సాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 24 గంటల్లో బెంగళూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
ఆస్ట్రేలియాతో ఆదివారం ఇండోర్లో జరిగిన మూడో వనే్డలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య. వరుసగా మూడో వనే్డను కైవసం చేసుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతేగాక, ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
ఇండోర్, సెప్టెంబర్ 24: ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వనే్డలోనూ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా విజయభేరి మోగించింది. 294 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించి, ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ని గెల్చుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా మూడు విజయాలను నమోదు చేయడంతో, చివరి రెండు వనే్డలకు ప్రాధాన్యం లేకుండాపోయింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ బి హార్దిక్ పాండ్య 42, ఆరోన్ ఫించ్ సి కేదార్ జాధవ్ బి కుల్దీప్ యాదవ్ 124, స్టీవెన్ స్మిత్ సి జస్ప్రీత్ బుమ్రా బి కుల్దీప్ యాదవ్ 63, గ్లేన్ మాక్స్వెల్ స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 5, ట్రావిస్ హెడ్ బి జస్ప్రీత్ బుమ్రా 4, మార్కస్ స్టొయినిస్ 27 నాటౌట్, పీటర్ హాండ్స్కోమ్ సి మనీష్ పాండే బి జస్ప్రీత్ బుమ్రా 3, ఆష్టన్ అగర్ 9 నాటౌట్, ఎక్స్ట్రాలు 16, మొత్
టోక్యో, సెప్టెంబర్ 24: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో విక్టర్ ఎక్సెల్సెన్, మహిళల సింగిల్స్లో కరోలినా మారిన్ విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎక్సెల్సెన్ 21-14, 19-21, 21-14 ఆధిక్యంతో లీ చాంగ్ వెయ్పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం అభిమానులను అలరించింది.
దుబాయ్, సెప్టెంబర్ 24: శ్రీలంక క్రికెట్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విచారణ చేపట్టింది. అయితే, ఫలానా సిరీస్ లేదా టోర్నమెంట్ సమయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు ఆదేశించినట్టు ఐసిసి స్పష్టం చేయలేదు. వరల్డ్ కప్సహా పలు మ్యాచ్ల్లో శ్రీలంక క్రికెటర్లు ఫిక్సింగ్కు పాల్పడినట్టు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది.