-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
చెన్నై, సెప్టెంబర్ 17: వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగానే వర్షం వెంటాడిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను భారత్ 26 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 281 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు ఈ స్కోరు సాధ్యమైంది.
భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే సి వేడ్ బి కౌల్టర్ నైల్ 5, రోహిత్ శర్మ సి కౌల్టర్ నైల్, బి స్టొయినిస్ 28, విరాట్ కోహ్లీ సి గ్లేన్ మాక్స్వెల్ బి కౌల్టర్ నైల్ 0, మనీష్ పాండే సి మాథ్యూ వేడ్ బి కౌల్టర్ నైల్ 0, కేదార్ జాధవ్ సి హిల్టన్ కార్ట్రైట్ బి స్టొయినిస్ 40, ధోనీ సి డేవిడ్ వార్నర్ బి పాల్క్నెర్ 79, హార్దిక్ పాండ్య సి జేమ్స్ ఫాల్క్నెల్ బి ఆడం జంపా 83, భువనేశ్వర్ కుమార్ 32 నాటౌట్, కుల్దీప్ యా
చెస్టర్ లీ స్ట్రీట్, సెప్టెంబర్ 17: ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్ని వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఇంతకు ముందు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 1-2 తేడాతో చేజార్చుకున్న వెస్టిండీస్ టి-20 ఫార్మాట్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ, 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది.
సియోల్లో జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ మిక్స్డ్ డబుల్స్ నెగ్గిన డెబ్బీ సుశాంతో, ప్రవీణ్ జోర్డాన్ జోడీ. వీరు ఫైనల్లో వాంగ్ ఇలూ, హువాంగ్ డాంగ్ పింగ్ జోడీని 21-17, 21-18 తేడాతో ఓడించారు
కొలంబో, సెప్టెంబర్ 17: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ బ్యాట్స్మన్ చామర సిల్వలపై సస్పెన్షన్ వేటు పడింది. టైర్ ‘బి’ స్థాయి పోటీల్లో ఫిక్సింగ్కు పాల్పడినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, పనాదురా క్రికెట్ క్లబ్, కలుతరా ఫిజికల్ కల్చర్ క్లబ్ మధ్య ఈ ఏడాది జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు జరిగిన మ్యాచ్ని అతను ఫిక్స్ చేశాడని విచారణ కమిటీ నిర్ధారించింది.
ఎడ్మాంటన్, సెప్టెంబర్ 17: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో కెనడాను ఎదుర్కొంటున్న భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. మొదటి రోజున సింగిల్స్లో రాంకుమార్ రామనాథన్ విజయం సాధించగా, యుకీ భంబ్రీ చివరి వరకూ పోరాడినప్పటికీ పరాజయాన్ని చవిచూశాడు. దీనితో భారత్, కెనడా చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి.
రాంచీ, సెప్టెంబర్ 17: ప్రో కబడ్డీ లీగ్లో ఆదివారం పాట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చెరి 37 పాయింట్లు సాధించాయి. పాట్నా ఆటగాళ్లలో పర్దీప్ నర్వాల్ 13 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిస్తే, మోనూ గోయత్ 11 పాయింట్లు చేశాడు. బెంగాల్ ఆటగాడు మనీందర్ సింగ్ 15 పాయింట్లు సాధించగా, సబ్స్టిట్యూట్ దీపక్ నర్వాల్ 10 పాయింట్లు చేయడం విశేషం.
విశాఖపట్నం (స్పోర్ట్స్), సెప్టెంబర్ 16: ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టైటిల్ను స్కాట్లాండ్కు చెందిన జాన్ హిగ్గిన్స్ కేవసం చేసుకున్నాడు. కాగా, డిఫెండింగ్ చాంపియన్ ఆంథోని మెక్గిల్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఇక్కడి నోవాటెల్ హోటల్లో శనివారం స్కాట్లాండ్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీలో వరల్డ్ నెంబర్ త్రీ జాన్ హిగ్గిన్స్ అనుభవం ముందు మెక్గిల్ తలవంచక తప్పలేదు.
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మొదటి వనే్డ ఇంటర్నేషనల్ కోసం శనివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోచ్ రవి శాస్ర్తీతో కలిసి ప్రాక్టీస్ సెషన్కు హాజరైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
చెన్నై, సెప్టెంబర్ 16: శ్రీలంక పర్యటనకు వెళ్లి, అక్కడ టెస్టు, వనే్డ, టి-20 సిరీస్ల్లో ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాపై దృష్టి కేంద్రీకరించింది. ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్లో భాగంగా ఆదివారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్కి అన్ని విధాలా సిద్ధమైంది.