-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
చెన్నై, సెప్టెంబర్ 16: తాను రికార్డుల కోసం ఆడబోనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వనే్డ ఫార్మాట్లో ఇప్పటి వరకూ 30 సెంచరీలు చేసిన అతను అత్యధిక శతకాల జాబితాలో రికీ పాంటింగ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ తెండూల్కర్ మొత్తం 49 సెంచరీలతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వచ్చే ప్రపంచ కప్ చాంపియన్షిప్ను దృష్టిలో ఉంచుకొని, అప్పటి జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంలో కోచ్ రవి శాస్ర్తీ ప్రయోగాలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడం ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నది.
ఎడ్మాంటన్ (కెనడా), సెప్టెంబర్ 16: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్లో భారత్ తరఫున రాంకుమార్ రామనాథన్ శుభారంభం చేయగా, మరో మ్యాచ్లో కెనడా యువ సంచలనం డెనిస్ షపొవలోవ్ గెలిచాడు. దీనితో రెండు సింగిల్స్ మ్యాచ్లు ముగిసే సమయానికి ఇరు దేశాలు చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి. మొదటి సింగిల్స్లో రాంకుమార్ 5-7, 7-6, 7-5, 7-5 తేడాతో బ్రేడన్ షనర్ను ఓడించి, భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
చెన్నై, సెప్టెంబర్ 16: భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతులను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో కుల్దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అతనిని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆదివారం భారత్తో జరిగే మొదటి వనే్డ ఇంటర్నేషనల్కు సిద్ధమైన స్మిత్ చెప్పాడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారత సంచలన షూటర్ శపథ్ భరద్వాజ్ ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్కు అర్హత సంపాదించాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ద్వారా ప్రత్యేక శిక్షణకు ఎంపికైన ఈ 15 ఏళ్ల యువ షూటర్ ఇటీవలే ఇటలీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్లో కాంస్య పతకాన్ని సాధించాడు. తద్వారా వరల్డ్ కప్ ఫైనల్స్కు క్వాలిఫై అయ్యాడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త నిశంధనావళిని అమోదించిన వెంటనే, ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా చీఫ్గా వ్యవహరిస్తున్న ఫైనాన్స్ కమిటీ రద్దవుతుందని బోర్డు పాలనాధికారుల బృందం (సిఒఎ) స్పష్టం చేసింది. నిజానికి బోర్డు నిబంధనల్లోగానీ, లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లోగానీ ఎక్కడా ఫైనాన్స్ కమిటీ ప్రస్తావనే లేదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: వచ్చేనెల 11 నుంచి 22వ తేదీ వరకు ఢాకాలో జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును సాకీ ఇండియా ప్రకటించింది. జట్టు పగ్గాలను మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్కు అప్పగించింది. ఫార్వర్డ్ ఆటగాడు ఎస్వీ సునీల్ వైస్-కెప్టెన్గా సేవలు అందిస్తాడు.
జొహానె్నస్బర్గ్, సెప్టెంబర్ 16: దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ జీన్ పాల్ డుమినీ టెస్టు, ఫస్ట్ క్లాస్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అయతే, అతను వనే్డ, టి-20 ఫార్మాట్స్లో కెరీర్ను కొనసాగిస్తాడు. 46 టెస్టులు ఆడిన డుమినీ 2,103 పరుగులు సాధించాడు. 166 పరుగులు అతని అత్యధిక స్కోరు. 2,703 బంతులు వేసి, 1,601 పరుగులిచ్చిన అతను 42 వికెట్లు పడగొట్టాడు.
రాంచీ, సెప్టెంబర్ 16: ప్రో కబడ్డీ లీగ్లో శనివారం బెంగ ళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చెరి 26 పాయంట్లు చేశాయ. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 8, విశాల్ భరద్వాజ 7, నీలేష్ సాలుంకే 4, బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ 8, అజయ్ కుమార్ 5 చొప్పున పాయంట్లు చేశారు.
సియోల్, సెప్టెంబర్ 16: భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇక్కడ జరుగుతున్న కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ టైటిల్ దిశగా దూసుకెళుతున్నది. 22 ఏళ్ల ఈ తెలుగు తేజం సెమీ ఫైనల్లో చైనాకు చెందిన హి బింగ్జియావోను 21-10, 17-21, 21-16 తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. చివరి అడ్డంకిగా ఉన్న ప్రపంచ చాంపియన్ నొజోమీ ఒకుహరా (జపాన్)ను తుది పోరాటంలో ఓడిస్తే సింధుకు టైటిల్ దక్కుతుంది.