-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
సోఫియాలో జరిగిన బల్గేరియా బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన
జొనిమిర్ డర్కిన్జక్ను 18-21, 21-12, 21-17 తేడాతో ఓడించి టైటిల్ సాధించిన భారత ఆటగాడు లక్ష్య సేన్ (ఎడమ).
జూనియర్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ లక్ష్య చేతిలో ఓడిన డర్కిన్జక్ (కుడి) రన్నరప్గా నిలిచాడు
అహ్మదాబాద్, ఆగస్టు 17: ప్రో కబడ్డీ టోర్నమెంట్లో మ్యాచ్లు ఆసక్తి రేపుతున్నాయ. గురువారం జరిగిన రెండు మ్యాచ్లు చివరి వరకూ అ త్యంత ఉత్కంఠ సృష్టించాడు. మొదటి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ నుంచి ఎదురైన తీవ్రమైన ఒత్తిడిని అధిగమించిన దబాంగ్ ఢిల్లీ ఒక పాయం ట్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
సిన్సినాటి, ఆగస్టు 17: వరుస విజయాలతో దూసుకెళుతున్న జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్కు అమెరికా టీనేజ్ సంచలనం ఫ్రానె్సస్ తయాఫో బ్రేక్ వేశాడు. ఇక్కడ జరుగుతున్న సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను జ్వెరెవ్ను 4-6, 6-3, 6-4 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. తొలి సెట్ను గెల్చుకున్న జ్వెరెవ్ సులభంగానే మూడో రౌండ్ చేరతాడని అంతా ఊహించారు.
న్యూయార్క్, ఆగస్టు 17: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలో వైల్డ్కార్డ్ లభించకపోవడంతో నిరాశ చెందిన రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాకు యుఎస్ ఓపెన్లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆమెకు వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్టు టోర్నమెంట్ మేనేజ్మెంట్ ప్రకటించింది.
ఆమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్), ఆగస్టు 17: యూరోప్ టూర్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ని భారత్ 4-3 తేడాతో ఓడించింది. ఈ టూర్లో భారత్కు ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. అంతకు ముందు వరుసగా రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్పై నెగ్గిన ఈ జట్టు చివరి మ్యాచ్లో ప్రపంచ నాలుగో ర్యాంక్ జట్టు ఆసీస్ను ఢీ కొంది. హోరాహోరీగా సాగిన పోరులో విజయభేరి మోగించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: అండర్-19 క్రికెట్ టోర్నమెంట్కు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఆహ్వానించాలని నిర్ణయించినప్పటికీ, కేంద్రం నుంచి ప్రతికూల స్పందన రావడంతో నిరాశ చెందిన బిసిసిఐ ఇప్పుడు మరో ప్రయత్నం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీలో ఆడేందుకు పాక్ జట్టును అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.
మాడ్రిడ్, ఆగస్టు 17: స్టార్ ఆటగాడు నేమార్ పారిస్ సెయింట్ జెర్మెయిన్కు ట్రాన్స్ఫర్పై వెళ్లడం బార్సిలోనాను దెబ్బతీసిందా? అతను జట్టులో లేకపోవడంతో డీలాపడి పరాజయాన్ని చవిచూసిందా? సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎంతగా ప్రయత్నించినా, అతనికి మద్దతునిచ్చే వారు కరవయ్యారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
పల్లేకల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ శ్రీలంకలో సందడి చేస్తున్నారు. కొంత మంది అభిమానులతో కలిసి వారు తీయించుకున్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. కోచ్ రవి శాస్ర్తీ కూడా వారితో ఉండడంతో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విదేశీ టూర్ల సమయంలో ఆటగాళ్ల వెంట వారి భార్యలు లేదా గర్ల్ఫ్రెండ్స్ ఉండరాదన్న నిబంధనను కోహ్లీ పట్టించుకోవడం లేదు.
న్యూఢిల్లీ: కోట్లకు పడగలెత్తిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) డబ్బును పాలక మండలి సభ్యులు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారన్న విషయాన్ని సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) బహిర్గతం చేసింది.
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్కు తాను పాల్పడలేదని, తాను నిర్దోషినని భారత పేసర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లను 2013 మే 16న ఢిల్లీ పోలీసులు ముంబయిలో అరెస్టు చేయడం భారత క్రికెట్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.