-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
పల్లేకల్, ఆగస్టు 10: భారత్తో జరిగే మూడవ, చివరి టెస్టుకు ఫాస్ట్ మీడియం పేసర్ లాహిరు గామగేకు లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. మూడు మ్యాచ్ల సిరీస్ను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకోవడంతో, శనివారం నుంచి మొదలుకానున్న మూడో టెస్టు ప్రాధాన్యతను కోల్పోయింది.
లండన్, ఆగస్టు 9: దక్షిణాఫ్రికా సంచలన అథ్లెట్ వేడ్ వాన్ నికెర్క్ ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో బోణీ చేశాడు. పురుషుల 200, 400 మీటర్ల పరుగులో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన అతను 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 200 మీటర్ల విభాగంలో అతను పోటీపడాల్సి ఉంది. 25 ఏళ్ల వాన్ నికెర్క్ 400 మీటర్ల పరుగును 43.98 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు.
పల్లేకల్, ఆగస్టు 9: క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా ఒక టెస్టు సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్కు శ్రీలంకతో ఈనెల 12 నుంచి మొదలయ్యే చివరి, మూడో టెస్టులో అవకాశం దక్కనుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 23 ఏళ్ల అక్షర్ దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన సిరీస్లో భారత్ ‘ఎ’ తరఫున ఆడాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: గ్లాస్గో (స్కాట్లాండ్)లో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్స్లో భారత స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్ ఏకంగా రెండో రౌండ్ నుంచి పోరాటం సాగిస్తారు. వీరిద్దరికీ తొలి రౌండ్లో బై లభించింది. ఈ మెగా టోర్నీలో సింధు రెండు పర్యాయాలు కాంస్య పతకాన్ని సాధించగా, 2015లో సైనా రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఒలింపిక్స్లో ప్రవేశపెట్టనున్న క్రికెట్లో భారత్ పోటీపడే విషయంపై బిసిసిఐ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో నిర్ణయం తీసుకుంటారని బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) స్పష్టం చేసింది. ఒలింపిక్స్లో పాల్గొంటే, బిసిసిఐపైన కూడా జాతీయ క్రీడా సమాఖ్యగా ముద్రపడుతుంది.
నాగపూర్, ఆగస్టు 9: ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై బెంగళూరు బుల్స్ ఆరు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు 31 పాయింట్లు చేయగా, బెంగాల్ 25 పాయింట్ల వద్ద ఆగిపోయింది. బెంగళూరు తరఫున అజయ్ కుమార్ 8 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రోహిత్ కుమార్ 6, ఆశిష్ కుమార్ 5 చొప్పున పాయింట్లు చేశారు.
దుబాయ్, ఆగస్టు 8: ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఇప్పుడు ఉత్తమ ఆల్రౌండర్ల జాబితాలోనూ నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో అతను బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను కిందికి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
లండన్, ఆగస్టు 8: ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్స్లో మన దేశానికి చెందిన నిర్మలా షేవోరాన్ 400 మహిళల 400 మీటర్ల పరుగుపందెం సెమీ ఫైనల్స్లో అట్టడుగున నిలిచి అందరినీ నిరాశ పరిచింది. నిర్మల వ్యక్తిగత ఉత్తమ టైమింగ్ 51.28 సెకన్లు కాగా, ఈ పోటీలో ఆమె 53.07 సెకన్లలో రేస్ను పూర్తి చేసి సెమీఫైనల్స్ రెండో హీట్లో పాల్గొన్న ఎనిమిది మందిలో ఏడో స్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: కజకిస్థాన్లోని ఆస్తానాలో జరుగుతున్న ఆసియా షాట్గన్ 7వ చాంపియన్షిప్లో భారత వర్థమాన షూటర్ కినన్ చెనాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో అతనికి ఈ పతకం లభించింది. సీనియర్ లెవెల్లో చెనాయ్కి ఇదే తొలి అంతర్జాతీయ పతకం.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సస్పెన్షన్కు గురయిన ఆల్రౌండర్ అజయ్ జడేజా స్థానాన్ని ఈ నెల 12నుంచి పల్లెకెలెలో శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టులో ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.