-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), మే 24: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా భారత స్టార్ పివి సింధు ఎన్నికైంది. 21 ఏళ్ల సింధు నామినేషన్కు అనుకూలంగా 129 ఓట్లు వచ్చాయి. ఆమెతోపాటు మార్క్ వీబ్లెర్, కిర్స్టీ గిల్మోర్ కూడా బిడబ్ల్యుఎఫ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీబ్లెర్కు 108 ఓట్లు రాగా, గిల్మోర్కు 103 ఓట్లు లభించాయి.
ప్రో-కబడ్డీ లీగ్ వేలంలో అత్యధిక ధర ప రూ.93 లక్షలకు ఉత్తరప్రదేశ్ జట్టు కైవసం
విదేశీ ఆటగాళ్లలో అబోజర్కు రూ.50 లక్షలు ప రెండు రోజుల్లో రూ.46.99 కోట్లు కుమ్మరించిన 12 జట్లు
కోల్కతా, మే 23: తానెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదని, మహిళల వన్డే మ్యాచ్లలో అత్యధిక వికెట్లు సాధించిన ఝులన్ గోస్వామి చెప్పింది. దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన చతుర్ముఖ సిరీస్లో భారత జట్టు విజయం సాధించడం వచ్చే నెలనుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్కు మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయ పడింది.
జెనీవా, మే 23: జెనీవా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి స్కాట్ లిప్స్కీ (అమెరికా) శుభారంభాన్ని సాధించారు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో వీరు స్పెయిన్కు చెందిన టామీ రాబెర్డో, డేవిడ్ మర్రెరో జోడీని మట్టికరిపించి రెండో రౌండ్కు దూసుకెళ్లారు.
బ్యాంకాక్, మే 23: ఆసియా యూత్ అథ్లెటిక్స్ రెండో ఎడిషన్ చాంపియన్షిప్లో భారత్ తన పోరాటాన్ని ఘనంగా ముగించింది. గురీందర్వీర్ సింగ్, పాలెందర్ కుమార్, మనీష్, అక్షయ్ నైనీలతో కూడిన మెడ్లీ రిలే జట్టు మంగళవారం ఇక్కడ రోజు పసిడి మెరుపులు మెరిపించి భారత్ పోరాటానికి గోల్డెన్ ఫినిష్ ఇచ్చింది.
నంబెర్గ్, మే 23: నంబర్గ్లో జరుగుతున్న డబ్ల్యుటిఎ టోర్నమెంట్లో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి యారోస్లావా స్వెదోవాకు ఆదిలోనే చుక్కెదురైంది.
అనుమానాలకు లాజిక్కు ఉండదు. పదో ఐపిఎల్లో నిరుటి విజేత సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలిమినేటర్లో ఓడడానికి బెంగళూరులో కురిసిన వర్షం ఒక కారణమైతే, జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ప్రతిభ మరో కారణమని అభిమానులు వాదిస్తున్నారు.
బెంగళూరు, మే 19: పదో ఐపిఎల్లో మొదటి రెండు స్థానాలు ఆక్రమించిన జట్లే ఫైనల్లో పోరా డనున్నాయ. గ్రూప్ దశలో మొదటి స్థానాన్ని సంపాదించిన ముంబయి ఇండియన్స్ మొదటి క్వాలిఫయర్లో రెండో స్థానంలో ఉన్న రైజింగ్ పుణే సూపర్జెయింట్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. అయితే, రెండో క్వాలిఫయర్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఆరు వికెట్ల తేఆడాతో చిత్తుచేసి ఫైనల్లో చోటు సంపాదించింది.
మాంట్రియల్, మే 19: రష్యాలోని డోపింగ్ నిరోధక విభాగం (ఆర్యుఎస్ఎడిఎ)పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. రష్యాలో ప్రభుత్వమే డోపింగ్ను ప్రోత్సహించిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక అప్పట్లో క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగానే ఆర్యుఎస్ఎడిఎను వాడా రెండేళ్లు నిషేధించింది.
హామిల్టన్, మే 19: భారత డిఫెండర్ సునీత లాక్రా కెరీర్లో వంద అంతర్జాతీయ మ్యాచ్లను పూర్తి చేసుకోగా, ఆ జాబితాలో తాజాగా మిడ్ఫీల్డర్ నవ్జోత్ కౌర్ చేరింది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆమె ఆడింది. నవ్జోత్కు ఇది వందో ఇంటర్నేషనల్ మ్యాచ్.