-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
సిడ్నీ, మే 17: నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడడం, డోప్ పరీక్షలో పట్టుబడడం అంటే ఏమితో ప్రపంచానికి తెలియని రోజుల్లోనే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడిన కెనడా మాజీ స్ప్రింటర్ బెన్ జాన్సన్ నటించిన ఒక వాణిజ్య ప్రకటనపై ఆస్ట్రేలియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. 1988 సియోల్ ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్లో బెన్ జాన్సన్ స్వర్ణ పతకం సాధించాడు.
ముంబయి, మే 17: ఇంగ్లాండ్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత కెప్టెన్ వినాట్ కోహ్లీ రాణిస్తాడని, ఆ సత్తా అతనికి ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నాడు.
న్యూఢిల్లీ, మే 17: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని సాధించడంతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని బజరంగ్ పునియా అన్నాడు.
ముంబయి, మే 17: భారత దేశంలో ఫుట్బాల్కు ఆదరణ పెరుగుతున్నదని స్పెయిన్ మాజీ క్రీడాకారుడు కార్లెస్ పయోల్ అన్నాడు. అంధేరీలోని ముంబయి ఫుట్బాల్ ఎరెనాలో అతను సుమారు 500 మంది పిల్లలతో కలిసి ఆడాడు. వారి నైపుణ్యాన్ని తిలకించారు. అనంతరం అతను మాట్లాడుతూ భారత్లో ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని, సాకర్ పట్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారని అన్నాడు.
న్యూఢిల్లీ, మే 16: భారత బాడ్మింటన్ డబుల్స్ విభాగం కోచ్ తాన్ కిమ్ హర్ ఈ ఏడాది ఆగస్టులో గ్లాస్గోలో జరిగే ప్రపంచ కోచింగ్ సదస్సుకు హాజరుకానున్నాడు. అందులో మాట్లాడే అవకాశం లభించిన ఏడుగురు ప్రముఖుల్లో అతను కూడా ఉండడం విశేషం. మలేసియాకు చెందిన తాన్ డబుల్స్ స్పెషలిస్టుగా పేరు సంపాదించాడు. 1996 ఒలింపిక్స్లో సెమీస్ వరకూ చేరాడు. థామస్ కప్ టోర్నీలో రజత పతకం సాధించాడు.
ప్యూకెకొ (న్యూజిలాండ్), మే 17: భారత హాకీ క్రీడాకారిణి సునీత లాక్ర సెంచరీ పూర్తి చేసింది. న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల ఇరీస్లో భాగంగా బుధవారం నాటి మూడో మ్యాచ్ ఆమెకు కెరీర్లో వందోది కావడం విశేషం. కెరీర్లో వంద లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో చోటు సంపాదించింది. ఒడిశాలో జన్మించిన సునీత 2009లో అంతర్జాతీయ మ్యాచ్ల్లో అరంగేట్రం చేసింది.
మాంట్రియల్, మే 17: డోపింగ్ రహిత క్రీడా రంగాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. కానీ, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, క్రీడల ప్రక్షాళనకు నడుం బిగించింది. గురువారం జరిగే కీలక సమావేశంలో పలు విప్లవాత్మక తీర్మానాలను ఆమోదించే అవకాశాలున్నాయి.
ముంబయి, మే 16: హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా ఓటమిపాలుకాగా, పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రైజింగ్ పుణే సూపర్జెయింట్ మంగళవారం నాటి మొదటి క్వాలియఫయర్లో విజయభేరి మోగించి ఫైనల్కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన కారణంగా ముంబయికి ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది.
బెంగళూరు, మే 16: తటస్థ వేదికైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఎలిమినేటర్లో కోల్కతా నైట్ రైడర్స్తో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఢీ కొంటుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరాలంటే, 19న జరిగే రెండో క్వాలిఫయర్లో విజయం సాధించాలి.
బెంగళూరు: వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయంతో బాధపడుతున్న కారణంగా పదో ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని జట్టు కోచ్ టామ్ మూడీ ప్రకటించాడు. కోల్కతా నైట్ రైడర్స్తో బుధవారం ఎలిమినేటర్ జరగనున్న నేపథ్యంలో అతను విలేఖరులతో మాట్లాడుతూ నెహ్రా కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపాడు.