-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కరాచీ, ఏప్రిల్ 28: పాకిస్తాన్ క్రికెటర్లు ఉమర్ అక్మల్, జునైద్ ఖాన్ వివాదంపై విచారణకు ఒక కమిటీని నియమించారు. పాకిస్తాన్ జాతీయ వనే్డ చాంపియన్షిప్లో భాగంగా సింధ్ రావల్పిండితో మ్యాచ్ కోసం పంజాబ్ ప్రావీన్స్ జట్టు సిద్ధమవుతున్నప్పుడు చోటు చేసుకున్న సంఘటన ఇరువురు క్రికెటర్ల మధ్య అగాథాన్ని సృష్టించింది. పంజాబ్ ప్రావీన్స్కు ఉమర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, అదే జట్టులో జునైద్ ఉన్నాడు.
దోహా, ఏప్రిల్ 28: ఆసియా స్నూకర్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు పంకజ్ అద్వానీ ఫైనల్కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్లో పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ బిలాల్ను 5-0 తేడాతో అతను చిత్తుచేశాడు. పదహారు పర్యాయాలు ప్రపంచ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న అతను ఫైనల్లో చైనాకు చెందిన రెండో సీడ్ లివ్ హవోతియన్తో తలపడతాడు.
సెటుబల్ (పోర్చుగల్), ఏప్రిల్ 28: ఫిఫా అండర్-17 చాంపియన్షిప్ కోసం సిద్ధమయ్యే క్రమంలో భాగంగా ప్రస్తుతం ఐరోపా టూర్లో ఉన్న భారత జట్టు ఒక స్నేహపూర్వక మ్యాచ్ని డ్రా చేసుకుంది. ఎస్ఎల్ బెన్ఫికాతో జరిగిన ఈ మ్యాచ్ 2-2గా ముగిసింది. మ్యాచ్ ఆరంభంలో బెన్ఫికా ఆధిక్యాన్ని సంపాదించగా, ద్వితీయార్థం చివరిలో జితేంద్ర, షాజహాన్ చెరొక గోల్ చేసి భారత్ను గట్టెంకించారు.
పదో ఐపిఎల్లో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వందలకుపైగా పరుగులు సాధించడం ఇది రెండోసారి. హైదరాబాద్లో ఈనెల ఐదో తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు నాలుగు వికెట్లకు 207 పరుగులు సాధించింది. తాజా మ్యాచ్లో మూడు వికెట్లకు సరిగ్గా అదే స్కోరును నమోదు చేసింది. మరో రెండు జట్లు మాత్రమే ఈసారి రెండు వందలకుపైగా పరుగులు సాధించగలిగాయి.
లండన్లోని వెంబ్లే స్టేడియంలో శనివారం జరిగే హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైట్కు సిద్ధంగా ఉన్న ఆంథోనీ జాషువా, వ్లాదిమిర్ క్లిచ్కో.
ఈ ఫైట్ను చూసేందుకు కనీసం 90,000 మంది హాజరవుతారని అంచనా. 1939 తర్వాత బ్రిటన్లో ఒక బాక్సింగ్ ఫైట్కు భారీగా హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇదే అవుతుంది
సిడ్నీ, ఏప్రిల్ 28: ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ హార్న్స్తో ఫిలిప్పీన్స్ బాక్సర్ మానీ పాక్వియావో ఫైట్కు గ్రీన్ సిగగ్నల్ లభించింది. జూలై 2న బ్రిస్బేన్లో వీరి మధ్య ఫైట్ ఉంటుందని ఆసీస్కు చెందిన ప్రమోటర్లు ప్రకటించారు. పాక్వియావో నిరుడు నవంబర్లో ప్రపంచ బాక్సింగ్స్ సంస్థ (డబ్ల్యుబివో) టైటిల్ను వరుసగా మూడోసారి నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో రెండోసారి ఆలౌటైంది. గతంలో ఎన్నడూ ఈ జట్టు ఒకే సీజన్లో రెండు పర్యాయాలు ఈ విధంగా ఆలౌట్ కాలేదు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ వంటి హేమాహేమీలు ఉన్న బెంగళూరు ఇలా విఫలం కావడం విచిత్రం.
స్టట్గార్ట్, ఏప్రిల్ 27: ఫ్రెంచ్ ఓపెన్ లేదా వింబుల్డన్ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైతే జూనియర్స్తోనైనా ఆడతానని రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా వ్యాఖ్యానించింది. నిషిద్ధ మాదక ద్రవ్యం మెల్డోనియంను ఉపయోగించినందుకు 15 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న ఆమె శిక్షా కాలాన్ని పూర్తిచేసి, ఇక్కడ ప్రారంభమైన స్టట్గార్ట్ డబ్ల్యుటిఎ టోర్నమెంట్తో మళ్లీ కెరీర్ను మొదలుపెట్టింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: గాయపడిన క్వింటన్ డికాక్ స్థానంలో వెస్టిండీస్ ఆల్రౌండర్ మార్లొన్ శామ్యూల్స్ను ఢిల్లీ డేర్డెవిల్స్ తీసుకుంది. ఈ మార్పును ఆమోదిస్తున్నట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల న్యూజిలాండ్ టూర్కు వెళ్లినప్పుడు డికాక్ గాయపడ్డాడు.