-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
మాడ్రిడ్, ఏప్రిల్ 24: బార్సిలోనా సాకర్ క్లబ్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆ క్లబ్ తరఫున 500 గోల్స్ మైలురాయిని చేరాడు. స్పానిష్ లీగ్ లా లిగా ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రియల్ మాడ్రిడ్తో హోరాహోరీగా సాగిన పోరులో మెస్సీ రెండు గోల్స్ సాధించి, బార్సిలోనాను గెలిపించాడు. అదే సమయంలో అతను బార్సిలోనా తరఫున 500 గోల్స్ను పూర్తి చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు ఆధిపత్య పోరాటాన్ని కొనసాగించాయి.
స్టట్గార్ట్, ఏప్రిల్ 24: డోపింగ్ కేసులో 15 నెలల సస్పెన్షన్ను పూర్తి చేసుకున్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా మళ్లీ అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించనుంది. బుధవారం మొదలయ్యే స్టట్గార్ట్ టోర్నమెంట్లో ఆడేందుకు సిద్ధమైంది. తాను మెల్డోనియం వాటినట్టు విలేఖరుల సమావేశం పెట్టి మరీ షరపోవా ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది.
లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 24: మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ను సంపాదించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తనకు పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే ఒక సందేశాన్ని పంపింది. ‘నీ రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏడాది బాక్స్లో కూర్చొని నా ఆటను చూసే తరుణం కోసం వేచి ఉన్నాను. నవ్వు వస్తున్నావని తెలిసిన మరుక్షణమే ఎంతో పొంగిపోయాను. నీ వల్లే నాకు ప్రశాంతత అంటే ఏమిటో తెలిసింది.
రాజ్కోట్, ఏప్రిల్ 23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 26 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్ను ఓడించింది. పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా మరోసారి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడితే, జట్టును గెలిపించేందుకు గుజరాత్ వికెట్కీపర్-బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్ పడిన శ్రమ వృథా అయింది.
కోల్కతా, ఏప్రిల్ 23: ఐపిఎల్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఎవరూ ఊహించని విధంగా కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 131 పరుగులకే కుప్పకూలింది.. కానీ, సులభంగా గెలిచే అవకాశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సద్వినియోగం చేసుకోలేకపోయంది. 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటై, చావుదెబ్బ తిన్నది. ఐపిఎల్ చరిత్రలోనే అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా అవమానకర మైన రికార్డు సృష్టించింది.
లండన్, ఏప్రిల్ 23: మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు ఆడుతున్న స్పానిష్ సాకర్ స్టార్ జ్లాటన్ ఇబ్రహిమోవ్ మోకాలికి తీవ్రగాయమైంది. దీనితో అతను ఈ సీజన్లో ఎంత వరకు మ్యాచ్లు ఆడతాడన్నది అనుమానంగానే ఉంది. యూరోపా లీగ్లో భాగంగా ఆండెర్లెచ్తో జరిగిన మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను కిందపడ్డాడు. మోకాలికి గాయంకావడంతో అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాజిల్టౌన్, ఏప్రిల్ 23: ఎంపిక చేసిన అతి కొద్ది మంది ఆహ్వానితుల మధ్య ప్రపంచ మేటి గోల్ఫర్ రొరీ మెక్రొయ్ వివాహం తన గర్ల్ఫ్రెండ్ ఎరికా స్టోల్తో జరిగింది. ఆహూతుల సంఖ్య రెండు వందలకు మించలేదని సమాచారం. ప్రచారానికి దూరంగా పెళ్లి జరగాలని వధూవరులు నిర్ణయించుకోవడంతో మీడియాను కూడా ఆహ్వానించలేదు.
మొనాకో, ఏప్రిల్ 23: మాంటెకార్లొ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను రాఫెల్ నాదల్ గెల్చుకున్నాడు. ఫైనల్లో అతను అల్బర్ట్ రమోస్ వినోలస్ను 6-1, 6-3 తేడాతో చిత్తుచేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడిన ‘స్పెయిన్ బుల్’ నాదల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయా విజయాన్ని సాధించాడు.
డబుల్స్లో నెగ్గిన బొపన్న
నాసో (బహమాస్), ఏప్రిల్ 23: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ రిలే చాంపియన్షిప్స్లో సూపర్ స్టార్లు జస్టిన్ గాల్టిన్, ఎలైన్ థాంప్సన్ అసాధారణ ప్రతిభతో రాణించి, తమతమ జట్లను గెలిపించారు. పురుషుల 4న100 మీటర్ల రిలేలో అమెరికా తరఫున చివరి లెగ్ పరిగెత్తిన గాల్టిన్ సుడిగాలి వేగాన్ని అందుకొని, ప్రత్యర్థుల కంటే ముందుగా లక్ష్యాన్ని చేరాడు.
పుణే, ఏప్రిల్ 22: హోం గ్రౌండ్లో శనివారం చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై పుణే సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో ‘గ్రేట్ ఫినిషర్’గా పేరు సంపాదించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.