-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ ముందం చేశాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, మొదటి రౌండ్లో బై లభించిన మనోజ్ రెండో రౌండ్లో స్థానిక ఫేవరిట్ రాబర్ట్ చమసన్యన్ను ఓడించాడు.
బుడాపెస్ట్, ఫిబ్రవరి 23: ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వాలన్న బుడాపెస్ట్ కలలు కల్లలయ్యాయి. 2024 ఒలింపిక్స్ను నిర్వహించే బాధ్యత అప్పగించాలంటూ ఇన్నాళ్లూ రేసులో ఉన్న హంగరీ హఠాత్తుగా నిర్ణయాన్ని మార్చుకుంది. ఒలింపిక్స్ నిర్వాహణ ప్రతిపాదనని చాలా మంది వ్యతిరేకించారని, సరైన మెజారిటీ లేకపోవడంతో ఒలింపిక్స్ రేసు నుంచి వైదొలగుతున్నామని హంగరీ ప్రధాని విక్టర్ ఒర్బాన్ ప్రకటించాడు.
పుణే, ఫిబ్రవరి 22: తన కెప్టెన్సీని విశే్లషించుకోవడానికి తగిన సమయం ఇంకా రాలేదని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభం కానున్న మొదటి టెస్టు కోసం నెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నాయకత్వం గురించి ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్నాడు.
కోల్కతా, ఫిబ్రవరి 22: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సుమారు 13 సంవత్సరాల తర్వాత జార్ఖండ్ వనే్డ క్రికెట్ జట్టుతో కలిసి రైల్లో ప్రయాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడానికి జార్ఖండ్ జట్టుతో కలిసి వెళ్లడానికే ధోనీ మొగ్గు చూపాడు. క్రియ యోగా ఎక్స్ప్రెస్ టూ-టైర్ ఎసి కోచ్లో అతను సహచరులతో కలిసి రాంచీ నుంచి హౌరా వరకూ ప్రయాణించాడు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సెంట్రల్ కాంట్రాక్టు పొందిన క్రికెటర్ల ఫీజు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. పాలనా వ్యవహారాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగు సభ్యులతో కూడిన కమిటీ (సిఒఎ)కు బిసిసిఐ ఒక ప్రతిపాదన పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ ‘ఎ’ ఆటగాళ్లకు ఏటా కోటి రూపాయల ఫీజు లభిస్తుంది.
పుణే, ఫిబ్రవరి 22: ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు లేదు. నాటి హేమాహేమీలకు సాటిరాగల వారు కనిపించకపోవడంతో కళతప్పింది. సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ వంటి క్రికెటర్ల కోసం ఆసీస్ ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తునే ఉంది. కానీ, ఆ స్థాయి క్రికెటర్లను ప్రపంచానికి అందించలేకపోయింది. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ బ్రాడ్మన్ది సుపరచితమైన పేరు.
కొలంబో, ఫిబ్రవరి 21: మహిళల ప్రపంచ కప్ వనే్డ క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని పి.సరా ఓవల్ స్టేడియంలో మంగళవారం చిట్టచివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో భారత జట్టు 1 వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
పుణె, ఫిబ్రవరి 21: మైదానంలోపల,బైటా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్ జట్టు స్వయంసమృద్ధంగా మారుతుండడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అంటూ, ఇలాంటి జట్టుతో కలిసి పని చేయడం తన అదృష్టమన్నాడు.‘గత పది నెలలుగా ఈ యువ క్రికెటర్లతో కలిసి పని చేసే అవకాశం నాకు లభించింది.
పుణె, ఫిబ్రవరి 21: క్రికెట్లో టాస్కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందరూ అంటారు. అయితే భారత్లో టాస్కు పెద్దగా ఎలాంటి ప్రాధాన్యత ఉండదని ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయ పడ్డాడు. గతంలో తాము భారత్లో వరసగా నాలుగు టాస్లు గెలిచామని, అయినప్పటికీ 4-0 తేడాతో సిరీస్ కోల్పోయామని కూడా లేమన్ గుర్తు చేశాడు. అంతేకాదు టాస్ గెలిచినప్పటికీ బాగా ఆడకపోతే విజయం సాధ్యం కాదని కూడా ఆయన అన్నాడు.