-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపుతో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని క్రీడాశాఖ మంత్రి కె అచ్చెంనాయుడు అన్నారు.
రియో డి జెనీరో, నవంబర్ 30: కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో ఫుట్బాల్ క్రీడాకారులుసహా మొత్తం 71 మంది మృతి చెందిన సంఘట బ్రెజిల్ను శోక సంద్రంలో ముంచేసింది. ఈ సంఘటన పట్ల ప్రస్తుత, మాజీ క్రీడాకారులు, అధికారులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేశం నలుమూలలా పెద్ద సంఖ్యలో ప్రజలు, ఫుట్బాల్ అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
చండీగఢ్, నవంబర్ 30: బ్రిటిష్ మోడల్ హాజెల్ కీచ్తో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం బుధవారం సిక్కుల సంప్రదాయ రీతిలో జరిగింది. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని బాబా రామ్ సింగ్ డేరా గురుద్వారా ఈ పెళ్లికి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
దుబాయ్, నవంబర్ 30: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే అత్యుత్తమంగా మూడో స్థానం సంపాదించాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 898, జో రూట్ (ఇంగ్లాండ్) 847 పాయింట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించగా, కోహ్లీ 833 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.
మకావూ, నవంబర్ 30: భారత ఆటగాడు ఇక్కడ జరుగుతున్న మకావూ ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో ప్రీ క్వార్టర్స్ చేరాడు. అతను రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చున్ వెయ్ చెన్ను 21-19, 21-8 తేడాతో సులభంగానే ఓడించి, లిన్ యూ సియెన్తో పోరును ఖాయం చేసుకున్నాడు. మరో రెండు రౌండ్ మ్యాచ్లో సియెన్ 21-15, 21-13 తేడాతో ఆండ్రె మార్టిన్పై విజయం సాధించాడు.
ముంబయి, నవంబర్ 30: చాలకాలంగా వాయిదా పడుతూ వస్తున్న లోధా కమిటీ సిఫార్సుల అమలుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జిఎం)లో తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సుమారు రెండేళ్లుగా నానుతున్న ఈ వివాదానికి ఇకనైనా తెరపడుతుందా లేక మరికొంత కాలం తాత్సారం చేయడానికే బోర్డు ప్రయత్నిస్తుందా అన్నది చూడాలి.
మొహాలీ, నవంబర్ 29: ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం మొహాలీలో ముగిసిన మూడో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించి కేవలం నాలుగు రోజులకే ఇంగ్లాండ్ను మట్టికరిపించింది. స్పిన్నర్లు మరోసారి చక్కగా రాణించి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు.
మొహాలీ: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 93.5 ఓవర్లలో 283 ఆలౌట్ (జానీ బెయిర్స్టో 89, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ 43, మహమ్మద్ షమీ 3/63, ఉమేష్ యాదవ్ 2/58, జయంత్ యాదవ్ 2/49, రవీంద్ర జడేజా 2/59).
మొహాలీ, నవంబర్ 24: ఏడాది క్రితం వరకు అతిగా స్పందించే నాసిరకం పిచ్లపై ఆడడానికి మీరు ఎందుకు ఇష్టపడుతున్నారనే ప్రశ్నలు వినిపించేవని, అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలు ‘టర్న్’ అయి మంచి పిచ్ల మీద కూడా ఎలా గెలవగలుగుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాపై సొంత గడ్డపై ఆడుతున్నప్పుడు టీమిండియాపై ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి.
మెల్బోర్న్, నవంబర్ 29: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండు మ్యాచ్ల హాకీ సిరీస్లో భారత జట్టు శుభారంభాన్ని సాధించింది. మంగళవారం మెల్బోర్న్లో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఆతిథ్య కంగారూలను మట్టికరిపించి ఈ సిరీస్లో బోణీ చేసింది. యువ స్ట్రైకర్ అఫ్ఫన్ యూసఫ్ అద్భుతమైన రెండు ఫీల్డ్ గోల్స్ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.