-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
మొహాలీ: బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్తో శుక్రవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో బెన్ స్టోక్స్తో అనుచితంగా ప్రవర్తించాడని బ్రిటన్ నుంచి వచ్చిన పాత్రికేయులు ఆరోపించడంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
మెల్బోర్న్, నవంబర్ 26: నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్ టైటిల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది. న్యూజిలాండ్తో శనివారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో టైటిల్ కోసం పోటీపడే అవకాశాన్ని చేజార్చుకొని, ఆదివారం మూడో స్థానం కోసం మలేసియాతో పోరును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభమైన మొదటి 15 నిమిషాల్లో భారత క్రీడాకారులు దూకుడును ప్రదర్శించారు.
మొహాలీ, నవంబర్ 26: భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ చేతి గాయం పూర్తిగా నయం కాకపోవడంతో ఇంగ్లాండ్తో శనివారం ప్రారంభమైన మూడో టెస్టుకు దూరమయ్యాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ చేతికి గాయమైంది. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్కు నొప్పి మరింత పెరిగిందని, అందుకే మూడో టెస్టుకు అతను దూరమయ్యాడని జట్టు మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.
కౌలూన్, నవంబర్ 25: భారత బాడ్మింటన్ స్టార్లు, హైదరాబాదీలు పివి సింధు, సైనా నెహ్వాల్ మధ్య పోరు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు టైటిల్ వేటను కొనసాగిస్తుండగా, సైనా పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. అంతేగాక, కెరీర్లో మొట్టమొదటిసారి ప్రపంచ ర్యాంకింగ్స్లో సింధు కంటే వెనుకబడింది.
మొహాలీ, నవంబర్ 25: ఐదు మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో విజయభేరి మోగించి 1-0 ఆధిక్యానికి దూసుకెళ్లిన భారత్ ఆత్మవిశ్వాసంతో శనివారం నుంచి మొదలయ్యే మూడో టెస్టుకు సిద్ధంకాగా, ఒక మ్యాచ్ని కోల్పోయిన ఇంగ్లాండ్ ఆత్మరక్షణలో పడింది. ఈ మ్యాచ్ని చేజార్చుకుంటే, చివరి రెండు టెస్టుల్లో గెలిస్తేగానీ సిరీస్ను డ్రా చేసుకునే అవకాశం ఉండదు.
అడెలైడ్, నవంబర్ 25: ఓపెనర్ ఉస్మాన్ ఖాజా సూపర్ సెంచరీతో నాటౌట్గా నిలవడంతో, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 307 పరుగులు చేయగలిగింది.
మొహాలీ: వికెట్కీపర్ పార్థీవ్ పటేల్ సుమారు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా కాలి కండరాలు బెణకడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని స్థానంలో వృషభ్ పంత్ టెస్టు ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ, ఎవరి అంచనాలకు అందని రీతిలో పార్థీవ్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు.
బాల్ ట్యాంపరింగ్పై స్పష్టతనివ్వాలని ఐసిసిని కుక్ కోరాడు. రాజ్కోట్లో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్యాంపరింగ్కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలపై అతను స్పందిస్తూ, ఈ విషయంలో మరింత స్పష్టమైన దిశానిర్దేశనం చేయాల్సిన అవసరం ఉందని ఐసిసికి సూచించాడు.
న్యూఢిల్లీ, నవంబర్ 24: బ్యాంకాక్లో శనివారం నుంచి ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ పాల్గొంటుంది. అయితే, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పాక్తో ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు ఆడని కారణంగా భారత మహిళల జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆరు పాయింట్ల కోత విధించడం తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే.
మెల్బోర్న్, నవంబర్ 24: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో గురువారం జరిగిన మ్యాచ్ని మలేసియాపై భారత్ 4-2 తేడాతో విజయభేరి మోగించింది. మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ రెండో మ్యాచ్లో చెలరేగిపోయింది. నిక్కిన్ తిమ్మయ్య రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.