-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
దుబాయ్, నవంబర్ 22: అంతర్జాతీయ ఉత్తమ టెస్టు క్రికెట్ బ్యాట్స్మన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు.
హరిద్వార్, నవంబర్ 22: హరిద్వార్లో జరుగుతున్న జాతీయ మహిళల సీనియర్ చాంపియన్షిప్స్లో తెలంగాణకు చెందిన వర్థమాన బాక్సర్, మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. దీంతో ఆమెకు ఈ ఈవెంట్లో పతకం ఖాయమైంది. 51 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో వేగంగా పురోగమిస్తున్న జరీన్ మంగళవారం జరిగిన క్వార్టర్ బౌట్లో అస్సాంకు చెందిన మంజు బసుమతరేపై సునాయాసంగా విజయం సాధించింది.
చెన్నై, నవంబర్ 22: మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 22వ ఎడిషన్లో పాల్గొంటామని స్పెయిన్కు చెందిన స్టార్ ఆటగాడు రాబెర్టో బటిస్టా అగట్తో పాటు క్రొయేషియాకు చెందిన మరో ఆటగాడు బోర్నా కోరిక్ ధ్రువీకరించారు.
విశాఖపట్నం, నవంబర్ 21: ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్లో భారత జట్టు బోణీ చేసింది. ఈ సిరీస్లో భాగంగా ఇంతకుముందు రాజ్కోట్లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన భారత జట్టు తాజాగా సోమవారం విశాఖపట్నంలోని వైఎస్.రాజశేఖర్రెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో ప్రత్యర్థులను 246 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యత సాధించింది.
విశాఖపట్నం, నవంబర్ 21: కెప్టెన్గా ఒత్తిడిని తాను ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నానని, అయితే మరోమూడేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ నరం ఎంత తనపై ఉందో అంనా వేయగలుగుతానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘బహుశా మూడు నాలుగేళ్ల తర్వాత మాత్రమే కెప్టెన్సీ భారం ఎంతగా నాపై ఉందో అంచనా వేయగలుగుతాను.
విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 21: విశాఖ టెస్టులో తాము చివరి వరకు కష్టపడినా మ్యాచ్ను నిలుపుకోలేకపోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. టాస్ గెలవడం భారత్కు కలిసొచ్చిందని, తొలిరోజు సునాయాసంగా భారత్ జట్టు పరుగులు సాధించిందని అన్నాడు. రెండవ రోజు నుండి ఈ పిచ్పై బ్యాట్స్మెన్ పరుగుల కోసం కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత క్రికెట్ బోర్డును సంస్కరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బిసిసిఐ పెద్దలపై జస్టిస్ ఆర్ఎం.లోధా కమిటీ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
కౌలూన్, నవంబర్ 21: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో తొలిసారి టైటిల్ కైవసం చేసుకుని మంచి ఊపుమీద ఉన్న తెలుగు తేజం, ఒలింపిక్ రజత పతక విజేత పివి.సింధు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో మరోసారి సత్తా చాటుకుని వచ్చే నెల దుబాయ్లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించాలని ఎదురు చూస్తోంది.
విశాఖపట్నం, నవంబర్ 21: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం ఐఎన్ఎస్ జలాశ్వను సందర్శించాడు. ఇంగ్లండ్పై భారత్ జట్టు విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్కు నేవల్ డాక్యార్డు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కొద్దిసేపు అశ్విన్ ముచ్చటించాడు.
ఫజూ (చైనా), నవంబర్ 20: భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆమె ఒక సూపర్ సిరీస్లో విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనా క్రీడాకారిణి సన్ యూను 21-11, 17-21, 21-11 తేడాతో ఓడించింది. రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించిన తర్వాత ఈ హైదరాబాదీ ఒక టైటిల్ను అందుకోవడం ఇదే ప్రథమం.