-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఫజూ (చైనా), నవంబర్ 17: చైనా సూపర్ సింగ్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రెండో రౌండ్లో ఆమె అమెరికాకు చెందిన బివెన్ జాంగ్ను 18-21, 22-20, 21-17 తేడాతో ఓడించింది. మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత పుంజుకున్న సింధు అద్వితీయ పోరాట ప్రతిభను కనబరచింది.
క్రైస్ట్చర్చి, నవంబర్ 17: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. కుంభ వృష్టి కురవడంతో ఫీల్డ్ అంపైర్లు టీ విరామం వరకూ వేచి చూశారు. అప్పటికీ జల్లులు పడుతునే ఉండడంతో, మొదటి రోజు ఆట రద్దయినట్టు ప్రకటించారు. శుక్రవారం నాటి ఆట నిర్ణీత సమయానికి ఒక అరగంట ముందుగా మొదలవుతుందని తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 17: హర్యానాకు చెందిన స్ప్రింటర్ ధరమ్వీర్ సింగ్పై ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. రియో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత సంపాదించినప్పటికీ, డోప్ టెస్టులో విఫలమైన కారణంగా చివరి క్షణాల్లో అతని ప్రయాణం రద్దయింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అప్పట్లో ప్రకటించింది.
విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 16: కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని, మురళీ విజయ్తో ఓపెర్గా దిగే అవకాశంలో రాహుల్కే ప్రాధాన్యం ఇస్తామని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో బుధవారం ప్రాక్టీస్ అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు.
విశాఖపట్నం(స్పోర్ట్స్), నవంబర్ 16: విశాఖలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినా, లేకపోయినా భయపడేది లేదని, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఆలస్టర్ కుక్ పేర్కొన్నాడు. బ్యాటింగ్లో 80 పరుగులకే ఆలౌటైతే, ప్రత్యర్థిని కూడా 80 పరుగుల లోపే అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తామని, రేపటి మ్యాచ్కు మా జట్టు సిద్ధంగా ఉందన్నాడు. పిచ్ రిపోర్టులు తాను చదివానని, ఐతే ఈ మ్యాచ్పై ఎంత ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్థకమని అన్నాడు.
విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 16: విశాఖలోని విసిఎ-విసిడిఎ పిచ్ ఆట రెండో రోజు తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఇంగ్లాండ్తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో స్పిన్ త్రయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా భూమిక కీలకంగా మారింది.
* విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 16: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య జరిగిన వనే్డ క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం నాటి చివరి, మూడో వనే్డలో వేదా కృష్ణమూర్తి బ్యాటింగ్లో, రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్లో రాణించడంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
ఫజూ (చైనా), నవంబర్ 16: ఇక్కడ ప్రారంభమైన చైనా సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీ మొదటి రౌండ్లోనే భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె కోలుకున్న తర్వాత తొలి టోర్నీలో పాల్గొని, చేదు అనుభవాన్ని చవిచూసింది. థాయిలాండ్కు చెందిన పోర్న్టిప్ బురనప్రసెట్సుక్ 21-16, 19-21, 21-14 తేడాతో సైనాను ఓడించింది. విజయం కోసం హైదరాబాదీ సైనా చేసిన పోరాటం ఫలించలేదు.
ముంబయి, నవంబర్ 16: రంజీ ట్రోఫీ క్రికెట్లో భాగంగా సర్వీసెస్ను ఢీకొన్న హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ తొమ్మిది వికెట్లకు 580 పరుగుల భారీ స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సందీప్ 203 పరుగులతో నాటౌట్గా నిలవగా, చామా మిలింద్ 136 పరుగులు సాధించాడు.
విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 15: యువ బ్యాట్స్మన్ లోకేష్ రాహుల్ ఇంగ్లాండ్తో గురువారం ఇక్కడ ప్రారంభం కానున్న రెండో టెస్టు ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడా? జట్టులోకి రాహుల్ను ప్రత్యేకించి అందుకే తీసుకున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాలి. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే మంగళవారం విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు.