-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
విశాఖపట్నం, అక్టోబర్ 22: విశాఖలో ఈ నెల 29న భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న 5వ వనే్డ టికెట్లు ఈ నెల 25నుంచి విక్రయించనున్నారు. ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో డేనైట్గా జరగనున్న వనే్డకు రూ.400 నుంచి రూ.5వేల టికెట్లు 12వేలు విక్రయానికి సిద్ధం చేసినట్టు విశాఖ సంయుక్త కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. అన్ని మీసేవ కేంద్రాల్లో వనే్డ టికెట్లను అందుబాటులో ఉంచామన్నారు.
ఆస్టిన్ (టెక్సాస్), అక్టోబర్ 22: చాలాకాలంగా బద్ధ శత్రువుల్లా ఆధిపత్య పోరాటాన్ని కొననసాగిస్తున్న మెర్సిడిజ్కు డ్రైవర్లు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోజ్బెర్గ్ ఆదివారం ఇక్కడ జరిగే యుఎస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్లో మరోసారి అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ చాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని అనుకుంటున్న హామిల్టన్ను రోజ్బెర్గ్ భయం వెంటాడుతున్నది.
సిడ్నీ, అక్టోబర్ 22: క్రికెట్ చరిత్రలో తొలి సబ్స్టిట్యూట్ బ్యాట్స్మన్గా నిక్ లార్కిర్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో వనే్డ ఎలిమినేషన్ కప్ ఫైనల్లో విక్టోరియాతో తలపడినప్పుడు డానియల్ హ్యూస్కు బదులు బ్యాటింగ్కు సబ్స్టిట్యూట్గా ఎంపికైన న్యూ సౌత్వేల్స్ ఆటగాడు లార్కిన్ ఈ ఘనతను అందుకున్నాడు.
న్యూఢిల్లీ: బిసిసిఐ ప్రధాన బలమే ఐపిఎల్. మ్యాచ్ల ప్రసార హక్కుల నుంచి అండార్స్మెంట్ల వరకూ ఐపిఎల్పై కోట్లాది రూపాయలు కురుస్తాయి. ప్రస్తుతం ఐపిఎల్ మ్యాచ్ ప్రసారాల హక్కు సోనీ నెట్వర్క్ సంస్థ వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాదితో ఈ కాంట్రాక్టు పూర్తవుతుంది. 2018 నుంచి పదేళ్ల కాలానికి టీవీ, ఇంటర్నెట్, మొబైల్లో ఐపిఎల్ మ్యాచ్ల ప్రసార, సమాచార హక్కులను కేటాయించడానికి బిసిసిఐ పాలక మండలి సిద్ధమవుతున్నది.
అహ్మదాబాద్, అక్టోబర్ 21: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్షిప్లో భాఠత్ ఫైనల్కు దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ శు క్రవారం జరిగిన సెమీ ఫైనల్లో థాయలాండ్ను చి త్తు చేసింది. భారత జట్టు 73 పాయంట్లు సాధిస్తే, థాయలాండ్ 20 పాయంట్లు చేయగలిగింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తరుణంలో తమ సిఫార్సులను అమలు చేయడంపై బిసిసిఐ అధికారులు ఏం చేస్తారో చూద్దామని విశ్రాంత న్యాయమూర్తి ఆర్ఎం లోధా అన్నారు. అతని ఆధ్వర్యంలోనే సుప్రీం కోర్టు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను అమలు చేసేందుకు బిసిసిఐ వెనకాడుతున్నది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్లో పాల్గొనే సమయంలో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్ఐ) అధికారులు రేస్ జరుగుతున్న సమయంలో స్టాల్స్లో ఎక్కడా కనిపించలేదని, తనకు మంచినీళ్లు ఇచ్చే వారు కూడా కరవయ్యారని రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై విచారణ పూర్తయన తర్వాత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. జేషకు ఎదురైన దుస్థితికి ఆమె కోచ్ నికోలయ్ స్నెసరెవ్ ప్రధాన కారకుడని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు చావుదెబ్బ తగిలింది. ఈ సిఫార్సులను డిసెంబర్ 3వ తేదీలోగా అమలు చేసి తీరాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చివరి వరకూ హోరాహోరీగా సాగిన రెండో వనే్డలో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 242 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ బి ఉమేష్ యాదవ్ 0, టామ్ లాథమ్ ఎల్బి కేదార్ జాదవ్ 46, కేన్ విలియమ్సన్ సి ఆజింక్య రహానే బి అమిత్ మిశ్రా 118, రాస్ టేలర్ సి రోహిత్ శర్మ బి అమిత్ మిశ్రా 21, కొరీ ఆండర్సన్ ఎల్బి అమిత్ మిశ్రా 21, ల్యూక్ రోన్చీ సి ధోనీ బి అక్షర్ పటేల్ 6, మిచెల్ సాంట్నర్ నాటౌట్ 9, ఆంటన్ డెవిసిచ్ సి అక్షర్ పటేల్ బి జస్ప్రీత్ బుమ్రా 7, టిమ్ సౌథీ బి జస్ప్రీత్ బుమ్రా 0, మాట్ హె