-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇటీవలే రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించిన ఏస్ షూటర్ జీతు రాయ్ని ‘చాంపియన్ ఆఫ్ ది చాంపియన్స్’గా అంతర్జాతీయ రైఫిల్స్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రకటించింది. ఈ విషయాన్ని భారత రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఎఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు.
ఇండోర్, అక్టోబర్ 9: న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి, మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతను ఈ ఫీట్ను ప్రదర్శించడం ఇది రెండోసారి. కెప్టెన్ హోదాలో రెండుసార్లు డబుల్ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్గా అతను రికార్డు నెలకొల్పాడు. ఆజింక్య రహానే కేవలం 12 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకొని, శతకానికే పరిమితమయ్యాడు.
వ్లాడివొస్టక్ (రష్యా), అక్టోబర్ 9: రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారిణి రుత్విక శివానీ గద్దె టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ కోసం యెవ్గెనియా కొసెస్కయాతో తలపడిన ఆమె 21-10, 21-13 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 26 నిమిషాల్లో ముగియడం విశేషం.
బెంగళూరు, అక్టోబర్ 9: మలేసియాలో ఈనెల 20 నుంచి 30 వరకు జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ను ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేష్ ధీమా వ్యక్తం చేశాడు. సరిహద్దులో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, త్యాగాలు చేస్తున్న సైనిక కోసం పాక్పై విజయం సాధిస్తామని ఇక్కడ జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న శ్రీజేష్ అన్నాడు.
అహ్మదాబాద్, అక్టోబర్ 9: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్షిప్లో దక్షిణ కొ రియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్పై అనూహ్య విజయం సాధించి, సంచలనం సృష్టించిన కొరియా ఆ గెలుపు ఆషామాషిగా దక్కింది కాదని అర్జెంటీనాతో ఆదివారం జరిగిన మ్యా చ్లో నిరూపించింది. 26 పాయంట్ల ఆధిక్యంతో గెలుపొంది, పాయంట్ల పట్టి కలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
సుజుకా (జపాన్), అక్టోబర్ 9: జపనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ను మెర్సిడిజ్ డ్రైవర్ నికో రోజ్బెర్గ్ గెల్చుకున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ కోసం లూయిస్ హామిల్టన్తో తీవ్రంగా పోటీపడుతున్న రోజ్బెర్గ్ సుజుకా ట్రాక్పై రేస్ ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కనబరిచాడు. ఈ ఏడాది తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. గత ఆరు రేసుల్లో అతను విజేతగా నిలవడం వరుసగా ఇది ఐదోసారి.
లండన్, అక్టోబర్ 9: ఏడేళ్ల క్రితం మొదటిసారి డాన్ హెండర్సన్ను లాస్ వెగాస్లో ఢీకొన్నప్పుడు ఎదురైన పరాజయానికి మైఖేల్ బిస్పింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన యుఎఫ్సి 204 మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ పోరులో అతను హెండర్సన్ను చిత్తు చేశాడు. బిస్పింగ్ పంచ్లతో హెండర్సన్కు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించకుండా జాగ్రత్త పడిన రిఫరీ ఫైట్ను నిలిపేశాడు.
ఇండోర్, అక్టోబర్ 8: ఫామ్ కోసం అల్లాడుతున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలం తర్వాత సత్తా చాటాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే అజేయ సెంచరీతో అభిమానులను అలరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. కోహ్లీతోపాటు ఆజింక్య రహానే 79 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు.
ఇండోర్, అక్టోబర్ 8: భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి టామ్ లాథమ్ బి జీతన్ పటేల్ 10, గౌతం గంభీర్ ఎల్బి ట్రెంట్ బౌల్ట్ 29, చటేశ్వర్ పుజారా బి మిచెల్ సాంట్నర్ 41, విరాట్ కోహ్లీ 103 నాటౌట్, ఆజింక్య రహానే 79 నాటౌట్, ఎక్స్ట్రాలు 5, మొత్తం 90 ఓవర్లలో 3 వికెట్లకు 267.
వికెట్ల పతనం: 1-26, 2-60, 3-100.
ఇండోర్, అక్టోబర్ 8: భారత బ్యాట్స్మెన్కు స్పిన్ను అద్భుతంగా ఎదుర్కొంటారన్న పేరు ఉంది. కానీ, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ విధానం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. అతను స్పిన్నర్ల ధాటికి బెంబేలెత్తుతున్నాడు. తాజా టెస్టు ఇన్నింగ్స్లో అతను న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో అవుటయ్యాడు. మొత్తం మీద స్పిన్నర్లకు అతను చిక్కడం ఇది 18వ సారి.