-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఆగస్టు 31: తాము ఏర్పాటు చేసిన అభినందన సభకు రియో ఒలింపిక్స్ పతకాల విజేతలు పివి సింధు, సాక్షి మాలిక్ రావడమే తమకు దక్కిన గౌరవం అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మహిళల బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన సింధు, రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని అందుకున్న సాక్షిలను ఆయన బుధవారం ఢిల్లీ సచివాలయంలో ఘనంగా సత్కరించారు. సింధుకు రెండు కోట్లు, సాక్షికి కోటి రూపాయల నజరానాను అందించారు.
న్యూయార్క్, ఆగస్టు 31: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 29వ ర్యాంకర్ ఎకతరీన మకరోవాను 6-3, 6-3 తేడాతో సునాయాసంగా ఓడించింది. 1999లో మొదటిసారి యుఎస్ ఓపెన్లో విజయాన్ని నమోదు చేసిన సెరెనా తన కెరీర్లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్పై కనే్నసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: తనకు చదువ వంటబట్టలేదని, ఒక రకంగా అదే తన అదృష్టంగా మారిందని జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్లో గోపీచంద్ నిర్వహిస్తున్న అకాడెమీలో శిక్షణ పొందిన సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధిస్తే, రియో ఒలింపిక్స్లో సింధు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ సర్కారు బుధవారం ఒలింపిక్స్ విజేతలతోపాటు గోపీచంద్ను కూడా సత్కరించింది.
వాంకోవర్ (బ్రిటిష్ కొలంబియా), ఆగస్టు 30: కెనడాలో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్స్లో భారత్కు చెందిన వందేళ్ల ‘చిన్నారి’ మన్ కౌర్ సత్తా చాటింది. 100 మీటర్ల పరుగును ఆమె దాదాపు ఒకటిన్నర నిమిషం వ్యవధిలో పూర్తిచేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వృద్థ అథ్లెట్లకు నిర్వహించిన ఈ పోటీల్లో వందేళ్ల వయసు దాటిన వారి విభాగంలో మన్ కౌర్ ఒక్కరే బరిలోకి దిగారు.
మాక్కే (ఆస్ట్రేలియా), ఆగస్టు 30: నాలుగు దేశాల వనే్డ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం ఇక్కడ ఆతిథ్య ఆస్ట్రేలియా-ఎ జట్టుతో ఉత్కంఠ భరితంగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో ఇండియా-ఎ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 30: స్పెయిన్తో వచ్చే నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ పోరులో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టులో వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, రోహన్ బొపన్న జోడీకి ఎఐటిఎ (అఖిల భారత టెన్నిస్ సంఘం) సెలెక్షన్ కమిటీ మళ్లీ చోటు కల్పించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 30: రియో ఒలింపిక్స్లో విఫలమైనప్పటికీ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ను అదృష్టం వరించింది. 2012లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించిన రష్యా రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో ఆ పతకం యోగేశ్వర్ దత్కు దక్కింది.
దుబాయి, ఆగస్టు 30: ఐసిసి టి-20 బ్యాట్స్మెన్ ర్యాకింగ్స్లో భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ల జాబితాలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి టాప్- 5లో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఏడోస్థానంలో ఉండిన అశ్విన్ ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్న ‘లెజెండరీ’ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నలుగురు ఒలింపిక్ స్టార్లకు భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సోమవారం రాష్టప్రతి అందచేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: రాజీవ్ ఖేల్ రత్న అవార్డును స్వీకరించడానికి రాష్టప్రతి భవన్కు వచ్చిన తెలుగు అమ్మాయి, భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఎంతో సంతోషంగా కనిపించింది. తనను కలిసిన విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పింది. ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన చిరకాల స్వప్నం సాకారమైందని అన్నది.