-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, జూలై 18: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను సంస్కరించే విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బిసిసిఐ గౌరవిస్తుందని, ఇందుకు సంబంధించి జస్టిస్ ఆర్ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను అమలుపరిచేందుకు బిసిసిఐ కృషి చేస్తుందని ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్ రాజీవ్ శుక్లా సోమవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జూలై 18: భారత క్రికెట్ బోర్డులో ఆఫీసు బేరర్లుగా పనిచేసే వారికి వయో పరిమితి విధించాలని, 70 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు ఈ పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలని జస్టిస్ ఆర్ఎం.లోధా కమిటీ చేసిన పలు ప్రధాన సిఫారసులను ఆమోదిస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో మరాఠా మాంత్రికుడు శరద్ పవార్తో పాటు ఎన్.శ్రీనివాసన్, నిరంజన్షా లాంటి పలువురు కురువృద్ధులకు బిసిసిఐలో ద్వారాలు మూసుకుపోనున్నా
ముంబయి, జూలై 18: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి తన పక్కన ఉంటున్నందున రియో ఒలింపిక్స్పై పెద్ద పెద్ద పేరున్న క్రీడాకారిణిలను ఎదుర్కోవడానికి తానేమీ భయపడనని రియో ఒలింపిక్స్లో సానియా మీర్జాతో కలిసి డబుల్స్ జంటగా ఆడనున్న ప్రార్థనా తొంబ్రే చెప్పింది. ‘పెద్ద పెద్ద పేరున్న క్రీడాకారిణులను మేము ఢీకొంటాం. అయితే నాకెలాంటి భయమూ లేదు. ఎందుకంటే ప్రపంచ నంబర్ వన్ అయిన సానియా మీర్జా నా పక్కనే ఉంటుంది.
ముంబయి, జూలై 18: బ్రెజిల్లోని రియోడీజెనిరోలో వచ్చే నెల జరిగే ఒలింపిక్స్లో సత్తా చాటుకునేందుకు హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సమాయత్తమవుతోంది. అయితే రియోలో పతకాన్ని సాధించగలుగుతానా? లేదా? అనే దానిపై జోస్యం చెప్పేందుకు ఆమె నిరాకరించింది.
బ్యాంకాక్, జూలై 18: డోపింగ్కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నుంచి థాయిలాండ్ స్టార్ షట్లర్ రచనోక్ ఇతనోన్కు సోమవారం మోక్షం లభించింది. దీంతో ఆమె వచ్చే నెల బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. మే 15వ తేదీన ఇతనోన్ అందజేసిన మూత్ర నమూనాలో ట్రియామ్సినొలోన్ ఎసిటోనైడ్ అనే మాదకద్రవ్య అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ఆమె డోపింగ్కు పాల్పడిందన్న అభియోగాలు వచ్చాయి.
దుబాయ్, జూలై 18: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో శనివారం లార్డ్స్ మైదానంలో ముగిసిన తొలి టెస్టులో యాసిర్ షా అద్భుత ప్రదర్శనతో 141 పరుగులకు 10 వికెట్లు కైవసం చేసుకుని పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం విదితమే.
బ్రిడ్జిటౌన్ (బార్బడోస్), జూలై 18: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో బార్బడోస్ ట్రైడెంట్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ సత్తా చాటుకున్నాడు. బ్రిడ్జిటౌన్లోని కింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఆదివారం సెయింట్ లూసియా జౌక్స్ జట్టుతో జరిగిన పోరులో అతను బ్యాట్ ఝళిపించి కేవలం 39 బంతుల్లో 81 (4 సిక్సర్లు, 9 ఫోర్లు సహా) పరుగులు సాధించాడు.
దిల్లీ: బీసీసీఐలో సమూల మార్పులను సూచిస్తూ జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ చేసిన సిఫార్సులను ఆర్నెల్లలోపు అమలు చేయాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఇబ్రహీం కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మంత్రి పదవిలో ఉన్న వారు బీసీసీఐలో సభ్యులుగా ఉండడానికి వీల్లేదు. బీసీసీఐలో ఒక రాష్ట్రం, ఒక ఓటు విధానం కొనసాగాలి. ఇక నుంచి బీసీసీఐలో కాగ్ ప్రతినిధి ఒకరు సభ్యుడిగా ఉంటారు.
న్యూఢిల్లీ, జూలై 17: ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబిఓ) ఆసియా పసిఫిక్ చాంపియన్ షిప్ సాధించిన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న విజేందర్ తాను కొద్ది రోజులు ఈ విజయాన్ని ఆస్వాదించిన తర్వాత పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటీష్ స్టార్ అమీర్ఖాన్తో తలపడే అవకాశాలను పరిశీలిస్తానని చెప్తున్నాడు.
బసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 17: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుతో జరిగిన రెండవ సన్నాహక మ్యాచ్లో చివరి రోజు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినహా భారత బౌలర్లు ఎవరూ సరిగా రాణించలేకపోయారు. దీంతో తొలి సన్నాహక మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.