-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
సావో పౌలో, జూన్ 18: మాజీ క్రీడాకారుడు టిటెను బ్రెజిల్ సాకర్ కోచ్ పదవి వరించిందని సమాచారం. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ నుంచి బ్రెజిల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో, కోచ్ దుంగాపై సాకర్ అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. అతని స్తానంలో టిటెను నిమయించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతను ప్రస్తుతం సేవలు అందిస్తున్న కొరంథియాస్ జట్టు మేనేజ్మెంట్ ధ్రువీకరించింది.
వియన్నా, జూన్ 18: రియో ఒలింపిక్స్లో పాల్గొనరాదని రష్యాపై వేసిన సస్పెన్షన్ వేటులో ఎలాంటి పొరపాటు లేదని, అది సరైన నిర్ణయమేనని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఎఎఎఫ్) తేల్చిచెప్పింది. వియన్నాలో సమావేశమైన ఐఎఎఎఫ్ పాలక మండలి రష్యాను ఒలింపిక్స్కు అనుమతించాలా లేదా అన్న విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.
బాకు (అజర్బైజాన్), జూన్ 17: అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యాన అజర్బైజాన్లోని బాకులో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ శుభారంభాన్ని సాధించాడు.
సియాటిల్, జూన్ 17: కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్లో అమెరికా జట్టు సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి సియాటిల్లోని సెంచరీ లింక్ ఫీల్డ్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జుర్గెన్ క్లిన్స్మన్ నేతృత్వంలోని అమెరికా జట్టు 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్ను మట్టికరిపించి టైటిల్ సాధన దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టును అదృష్టం వరించింది. గురువారం అర్థరాత్రి (్భరత కాలమానం ప్రకారం) ఆతిథ్య బ్రిటన్-బెల్జియం జట్ల మధ్య జరిగిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్ 3-3 గోల్స్తో డ్రాగా ముగియడంతో భారత జట్టు 36 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. 1978లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఆవిర్భవించినప్పటి నుంచి భారత జట్టు ఫైనల్కు చేరుకోవడం ఇదే తొలిసారి.
మెల్బోర్న్, జూన్ 17: భారత సంతతికి చెందిన మల్లయోధుడు (రెజ్లర్) వినోద్ కుమార్ దహియా ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 66 కిలోల గ్రీకో-రోమన్ విభాగంలో అతను ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు.
మాలాహైడ్ (ఐర్లాండ్), జూన్ 17: రెండు మ్యాచ్ల వనే్డ సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు దుసాన్ షనక ఆల్రౌండ్ ప్రతిభతో దుమ్ము రేపాడు. అటు బ్యాటింగ్లో విజృంభించి కేవలం 19 బంతుల్లో 42 పరుగులు సాధించిన షనక, ఇటు బౌలింగ్లోనూ చక్కగా రాణించి 43 పరుగులకే 5 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు 76 పరుగుల తేడాతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది.
కోల్కతా, జూన్ 17: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సూపర్లీగ్ ఫైనల్లో భాగంగా మోహన్ బగాన్ జట్టు, భవానీపూర్ క్లబ్ జట్ల మధ్య శనివారం ఇక్కడ ప్రారంభమయ్యే నాలుగు రోజుల మ్యాచ్ దేశంలోనే తొలిసారిగా పింక్బాల్తో జరిగే తొలి డే/నైట్ మ్యాచ్ కాబోతోంది. టీమిండియా తరఫున గతంలో ఆడిన మహమ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహాలు తొలిసారిగా ఈ తరహా క్రికెట్ అనుభవాన్ని చవి చూడబోతున్నారు.
బసెటెర్ (సెయింట్ కీట్స్ అండ్ నెవిస్), జూన్ 16: ఇమ్రాన్ తాహిర్ స్పిన్ మాయ వెస్టిండీస్తో జరిగిన ట్రై సిరీస్ గ్రూప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు 139 పరుగుల తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. తాహిర్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి, 45 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. హషీం ఆమ్లా శతకంతో రాణించడంతో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 343 పరుగుల భారీ స్కోరును సాధించింది.
న్యూఢిల్లీ, జూన్ 16: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పంజాబ్ పోలీస్పైనా కేసు పెట్టాలని స్పష్టం చేసింది. సర్దార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ భారత సంతతికి చెందిన ఇంగ్లాండ్ మహిళా జట్టు సభ్యురాలు నిరుడు జనవరిలో ఆరోపించింది.