-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
పారిస్, మే 22: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో పదో ర్యాంక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె డన్కా కొవినిక్ను 6-2, 4-6, 7-5 తేడాతో ఓడించింది. ఇతర మ్యాచ్ల్లో అనస్తాసియా పవ్లిచెన్కొవా 6-2, 6-0 తేడాతో సారా సొరిబెస్పై టొర్మోపై గెలుపొందింది. సువెయ్ హీచ్ 7-6, 6-3 ఆధిక్యంతో లారా అరుబరెనాను ఓడించింది.
రాయ్పూర్, మే 22: కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ రాయల్ చాలెంజ ర్స్ బెంగళూరును ప్లే ఆఫ్కు చేర్చింది. ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆదివారం జరిగిన కీల క మ్యాచ్లో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన డేర్డెవిల్స్ 20 వర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 60 పరుగులతో రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు.
న్యూదిల్లి:బిసిసిఐ అధ్యక్షుడిగా యువ బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతకాలం అధ్యక్షుడిగా వ్యవహరించిన శశాంక్ మనోహర్ ఐసిసి చైర్మన్గా ఎన్నికైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఆ పదవికి జరిగిన ఎన్నికల్లో ఠాకూర్ ఎన్నికయ్యారు. 1963లో ఫతేసింగ్ గైక్వాడ్ 33 ఏళ్లవయసులో ఈ పదవిని చేపట్టాక మళ్లీ ఆ పీఠాన్ని అధిరోహించిన వారిలో అతి పిన్నవయస్కుడు అనురాగ్ ఠాకూరే కావడం విశేష.
ముంబయి, మే 21: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఠాకూర్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో, ఆదివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అతను పోటీ లేకుండా ఎన్నిక కావడం ఖాయమైంది. బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ రికార్డు సృష్టించనున్నాడు.
అస్టానా (కజకస్తాన్), మే 21: రియో ఒలింపిక్స్కు అర్హత సంపాదించాలన్న భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఆశలు గల్లంతయ్యాయి. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది.
పారిస్, మే 21: రోలాండ్ గారోస్లో క్లే కోర్టుపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్ సమరంలో మహిళల సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకొని, ఓపెన్ శకం ఆరంభమైన తర్వాత తిరుగులేని టెన్నిస్ స్టార్గా పేరు తెచ్చుకున్న స్ట్ఫె గ్రాఫ్ రికార్డును సమం చేయాలని ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆశిస్తున్నది. టైటిల్పై కనే్నసిన 34 ఏళ్ల సెరెనా ఇప్పటి వరకూ 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకుంది.
కోల్కతా/ రాయ్పూర్, మే 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గ్రూప్ దశ పోటీలు ఆదివారంతో పూర్తవుతాయి. 24 నుంచి ప్లే ఆఫ్ పోరు మొదలవుతుంది. ఆదివారం జరిగే రెండు మ్యాచ్ల్లో ఫలితాలు తేలితేగానీ, ప్లే ఆఫ్ దశకు చేరుకునే జట్లను ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది.
అస్ట్రావా, మే 21: ప్రపంచ నంబర్ వన్ స్ప్రింటర్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. ఇక్కడ జరిగిన చెక్ గోల్డెన్ స్పైక్ పోటీల్లో 100 మీటర్ల పరుగును 9.98 సెకన్లలో పూర్తి చేసిన బోల్డ్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఈఏడాది ఆగస్టులో రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్లోనూ విజయం తనదేనని పరోక్షంగా సంకేతాలు పంపాడు.
లీడ్స్, మే 21: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో శ్రీలంక ఇన్నిం గ్స్ 88 పరుగుల తేడాతో చిత్తయంది. పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మొదటి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో మరో ఐదు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యా టింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 298 పరు గులు సాధించింది. అందుకు సమాధానంగా లంక మొ దటి ఇన్నింగ్స్లో 91 పరుగులకు కుప్పకూలింది.
కాన్పూర్, మే 21: ఐపిఎల్లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లో గుజరాత్ లయన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసిన డిఫెండింగ్ చాంపియన్ ముంబయ ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం నాటి మ్యాచ్ల ఫలితాలు తెలిసన తర్వాత ప్లే ఆఫ్ జట్లు ఖరారవుతాయ. ఇలావుంటే, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 173 పరుగులు చేసింది.