S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/02/2020 - 01:40

క్రైస్ట్‌చర్చి: ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లు పడిన కష్టానికి బ్యాట్స్‌మెన్ గండి కొట్టారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 90 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ట్రెంట్ బౌల్ట్ 12 పరుగులకే మూడు వికెట్లు కూల్చి, భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు.

03/02/2020 - 02:37

అకాపల్కొ, మార్చి 1: మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషు లు, మహిళల టైటిళ్లను రాఫెల్ నాద ల్, హీథర్ వాట్సన్ కైవసం చేసుకున్నారు. ప్రపంచ నంబర్ వన్ నాదల్ ఫైనల్లో తన ప్రత్యర్థి టేలర్ ఫిజ్‌ను 6-3, 6-2 తేడాతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా ఓడించా డు.

03/02/2020 - 01:30

రాజ్‌కోట్: మిడిల్ ఆర్డర్ మ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ సెంచరీ సాధించడంతో, గుజరాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 304 పరుగులు చేయగలిగింది. ఐదు వికెట్లకు 217 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్టక్రు షెల్డన్ అండగా నిలిచాడు.

03/02/2020 - 01:30

కోల్‌కతా, మార్చి 1: ఇషాన్ పొరెల్ ఐదు వికెట్లు పడగొట్టడంతో, బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో కర్నాటక 122 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు అనుస్తుప్ మజుందార్ అజేయ సెంచరీతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 275 పరుగులు చేసిన బెంగాల్ రెండో రోజు, ఆదివారం ఉదయం ఆటను కొనసాగించి 312 పరుగులకు ఆలౌటైంది.

03/02/2020 - 01:29

సిడ్నీ, మార్చి 1: ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్ సెమీస్‌కు దూసుకెళ్లిం ది. ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఈ జట్టు వెస్టిండీస్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగు లు సాధించింది. ఓపెనర్ డానియేల్ వ్యాట్ 29, నటాలీ షివర్ 57, అమె ఎలెన్ జోన్స్ 23 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.

03/01/2020 - 04:42

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన రెండవ, చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 242 పరుగులకే ఆలౌటైంది. యువ ఓపెనర్ పృథ్వీ షా, ‘టెస్టు స్పెషలిస్టు’ చటేశ్వర్ పుజారా, తెలుగు తేజం హనుమ విహారీ అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. కివీస్ ఫాస్ట్ బౌలర్ కేల్ జమీసన్ ఐదు వికెట్లు పడగొట్టి, భారత్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు.

03/01/2020 - 04:37

మెల్బోర్న్, ఫిబ్రవరి 29: ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు దూకుడును కొనసాగిస్తున్నది. గ్రూప్ దశలో శనివారం జరిగిన చివరి, నాలుగో మ్యాచ్‌ని గెల్చుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసి, గ్రూప్ ‘ఏ’లో అగ్రస్థానాన్ని ఆక్రమించి, అధికారికంగా సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. షఫాలీ వర్మ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

03/01/2020 - 04:34

మెల్బోర్న్, ఫిబ్రవరి 29: మహిళల టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా కొనసాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్ 17 పరుగుల తేడాతో ఓడించింది. అసాధారణ బౌలింగ్ ప్రతిభ కనబరచిన సీమర్ హేలీ జెనె్సన్, ఆఫ్ స్పిన్నర్ లీ కాస్పెరెక్ న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో కేవలం 91 పరుగులకే ఆలౌటైంది.

03/01/2020 - 04:33

అకాపల్కొలో జరుగుతున్న మెక్సికో ఓపెన్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్. సెమీస్‌లో అతను గ్రెగర్ దిమిత్రోవ్‌ను 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టేలర్ ఫ్రిజ్‌తో టైటిల్ పోరు ఖాయం చేసుకున్నాడు. మరో సెమీ ఫైనల్లో ఫ్రిజ్ 2-6, 7-5, 6-3 స్కోరుతో జాన్ ఇస్నర్‌పై విజయం సాధించాడు.

03/01/2020 - 04:30

కోల్‌కతా, ఫిబ్రవరి 29: అనుస్తుప్ మజుందార్ అజేయ శతకాన్ని నమోదు చేయడంతో, బెంగాల్‌తో శనివారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నాటక తొమ్మిది వికెట్లకు 275 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ 35, ఆకాష్ దీప్ 44 చొప్పున పరుగులు చేశారు. కర్నాటక బౌలర్లలో అభిమన్యు మిథున్ 65 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

Pages