-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ముంబయి, ఏప్రిల్ 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మే ఒకటిన ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కి బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30వ తేదీ తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్లను నిర్వహించరాదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కు కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ముంబయి, ఏప్రిల్ 20: రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్కు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఐపిఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో పరాజయాన్ని ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 62 పరుగులు సాధించిన అతను కీలకపాత్ర పోషించాడు.
రాజ్కోట్, ఏప్రిల్ 20: హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ను ఓడించి సంచలనం సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ను ఆరోన్ ఫించ్ భయపెడుతున్నాడు. గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ లయన్స్తో ఢీ కొంటున్న సన్రైజర్స్ను ఫించ్ ఏ విధంగా చెలరేగుతాడోనన్న ఆందోళన వెంటాడుతున్నది. ఈసారి ఐపిఎల్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొందింది.
ఆర్సిరెస్ (స్విట్జర్లాండ్), ఏప్రిల్ 20: ఎక్స్ట్రీమ్ స్నోబోర్డింగ్ ప్రపంచ చాంపియన్ ఎస్టెల్ బాలెట్ ఒక చిత్రం షూటింగ్లో పాల్గొంటూ మంచి తుపానులో చిక్కుకొని దుర్మరణం చెందింది. 21 ఏళ్ల ఎస్టెల్ రక్షణ కవచాలను ధరించి స్నోబోర్డింగ్ చేస్తున్నదని, కానీ, హఠాత్తుగా విరుచుకుపడిన మంచు తుపానులో చిక్కుకుందని వలాయిస్ రాష్ట్ర పోలీస్ అధికారులు తెలిపారు.
ముంబయి, ఏప్రిల్ 20: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తొలిసారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సిఇవో)ను నియమించింది. మీడియా ప్రొఫెషనల్ రాహుల్ జోహ్రీని ఈ పదవికి ఎంపిక చేసినట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతను జూన్ ఒకటిన బాధ్యతలు చేపడతాడని పేర్కొంది. బోర్డు పాలనా వ్యవహారాలు సజావుగా సాగడంతోపాటు, క్రీడాభివృద్ధికి కూడా అతను కృషి చేస్తాడని తెలిపింది. ఇప్పటి వరకూ బోర్డులో ఇసివో పోస్టు లేదు.
చాంగ్జూ (చైనా), ఏప్రిల్ 20: చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో తెలుగు తేజం పివి సింధు ముందంజ వేసింది. మొదటి రౌండ్లో ఆమె నసుకీ సదైరాను 21-10, 21-12 తేడాతో ఓడించింది. మొదటి నుంచి ఆటపై పట్టు బిగించిన సింధు చివరి వరకూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ని పూర్తి చేసింది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్ను సమర్థంగా పూర్తి చేశాడు.
లాసనే్న, ఏప్రిల్ 20: రియో ఒలింపిక్స్ నిర్వాహణలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నాడు. బ్రెజిల్లో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ ఘనంగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేశాడు. స్పోర్ట్అకార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో అతను మాట్లాడుతూ బ్రెజిల్ రాజకీయ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న విషయం నిజమేనని అన్నాడు.
బెర్లిన్, ఏప్రిల్ 19: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ను వరుసగా రెండోసారి స్పోర్ట్స్ అవార్డు దక్కింది. 16వ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన అతను ‘ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్’ అవార్డును స్వీకరించారు. అతనికి ఈ అవార్డు లభించడం వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి.
ముంబయి జట్టు మొదటి మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్తో తలపడి 9 వికెట్ల తేడాతో చిత్తయింది. రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్లో గురజాత్ లయన్స్ను ఢీకొని, చివరి వరకూ పోరాడినప్పటికీ మూడు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తాజాగా సన్రైజర్స్ చేతిలో ఊహించని ఓటమిని ఎదుర్కొంది.
కరాచీ, ఏప్రిల్ 19: స్వదేశంలో క్రికెట్ సిరీస్లు పాకిస్తాన్కు ఎండమావిగానే మారాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకూ పెద్ద జట్లు ఏవీ పాకిస్తాన్లో పర్యటించలేదు. గత ఏడాది డిసెంబర్లో భారత్తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ రద్దయిన విషయం తెలిసిందే.