-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కొలంబో, ఏప్రిల్ 12: ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఏఏ టోర్నీల్లో ఆడాలో, వేటికి గైర్హాజరు కావాలో తానే సొంతంగా నిర్ణయించుకుంటున్నాడని ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగపై శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) ఆగ్రహంతో ఉంది. అందుకే ముంబయి ఇండియన్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అతను ఆడాల్సి ఉన్నప్పటికీ, ఇంత వరకూ నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ (ఎన్ఒసి)ని జారీ చేయలేదు.
కొలంబో, ఏప్రిల్ 12: శ్రీలంక సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య మళ్లీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్గా అరవింద డి సిల్వ వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది జయసూర్య సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన వెంటనే ఆ స్థానాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) అధికారులు డి సిల్వతో భర్తీ చేశారు.
సింగపూర్, ఏప్రిల్ 12: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించింది.
మొహాలీ, ఏప్రిల్ 11: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు హోం గ్రౌండ్లోనే చుక్కెదురైంది. తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా సోమవారం గుజరాత్ లయన్స్ను ఢీకొన్న పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో చిత్తయింది. తొలిసారి ఐపిఎల్లోకి అడుగుపెట్టిన గుజరాత్ తొలి మ్యాచ్లోనే విజయంతో బోణీ చేసింది. ఆరోన్ ఫించ్ 74 పరుగులు ఈ జట్టు విజయానికి దోహదపడ్డాయి.
బెంగళూరు, ఏప్రిల్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి టైటిల్పై గురిపెట్టింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో బెంగళూరు తొమ్మిదో ఐపిఎల్లో తొమి మ్యాచ్ని సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం ఆడనుంది.
సింగపూర్, ఏప్రిల్ 11: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్పై అనుమానాలకు తెరపడడం లేదు. మంగళవారం నుంచి సింగపూర్ సూపర్ సిరీస్ ఆరంభం కానుండగా, గతంలో ఒకసారి ఇక్కడ టైటిల్ సాధించిన సైనా మరోసారి అదే ఫీట్ను పునరావృతం చేయాలన్న ఉత్సాహంతో ఉంది. 2010 మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె తాయ్ జూ ఇంగ్ను 21-18, 21-15 తేడాతో ఓడించి టైటిల్ సాధించింది.
మెల్బోర్న్, ఏప్రిల్ 11: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ చైనా మహిళల క్రికెటర్లకు సహాయసహకారాలు అందించనుంది. సింగపూర్లో జన్మించిన మెగ్ తన సోదరి అన్నా లానింగ్ మాదిరిగానే క్రికెట్పై ఆసక్తిని పెంచుకుంది. ఆస్ట్రేలియా మహిళా జట్టులో స్థానం సంపాదించింది. అత్యుత్తమ ప్రతిభతో ఆ జట్టు కెపెన్గా పగ్గాలు చేపట్టింది.
ఇపో (మలేసియా), ఏప్రిల్ 11: ప్రతిష్ఠాత్మక అజ్లన్ షా హాకీ టోర్నమెంట్ టైటిల్ రేసులో కొనసాగాలంటే భారత్కు మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే గ్రూప్ మ్యాచ్ని తప్పక గెల్చుకోవాలి. గ్రూప్ దశలో మూడో మ్యాచ్ని కెనడాతో ఆడిన భారత్ 3-1 తేడాతో విజయం సాధించింది. మొత్తం మీద మూడు మ్యాచ్ల్లో రెండింటిని గెలిచి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ కూడా మూడు మ్యాచ్లు ఆడింది.
కోల్కతా, ఏప్రిల్ 10: గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయభేరి మోగించింది. ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్లో ఆ జట్టు మరో 35 బంతులు మిగిలి ఉండగానే, తొమ్మిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
ముంబయిలోని ఓవల్ మైదాన్లో ఆదివారం జరిగిన జరిగిన ఒక చారిటీ షోలో పాల్గొని, పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడుతున్న బ్రిటిష్ యువరాజు విలియమ్స్ భార్య కాథెరిన్ విలియమ్స్. మాజీ క్రికెటర్లు దిలీప్
వెంగ్సర్కార్, సచిన్ తెండూల్కర్ కూడా పాల్గొన్నారు.