-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇపో (మలేసియా), ఏప్రిల్ 9: స్టార్ ఫార్వర్డ్ మన్దీప్ సింగ్ చేరికతో అజ్లన్ షా హాకీ టోర్నమెంట్లో పాల్గొంటున్న భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. తండ్రి హఠాన్మరణంతో స్వస్థలానికి వెళ్లిన మన్ప్రీత్ అక్కడ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి వచ్చాడు. ఈటోర్నీ మొదటి మ్యాచ్లో జపాన్ను ఎదుర్కొని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 1-5 తేడాతో చిత్తయింది.
ముంబయి, ఏప్రిల్ 8: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది. ముంబయిలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద గల సర్ధార్ వల్లభాయ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఆరంభ వేడుకలతో ఈ టోర్నీకి తెర లేచింది.
ఏప్రిల్ 9 ముంబయి ఇండియన్స్-పుణె సూపర్జెయింట్స్ ముంబయి
ఏప్రిల్ 10 కోల్కతా నైట్ రైడర్స్-్ఢల్లీ డేర్డెవిల్స్ కోల్కతా
ఏప్రిల్ 11 కింగ్స్ ఎలెవెన్ పంజాబ్-గుజరాత్ లయన్స్ మొహాలీ
ఏప్రిల్ 12 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్రైజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 13 కోల్కతా నైట్ రైడర్స్-ముంబయి ఇండియన్స్ కోల్కతా
ఏప్రిల్ 14 గుజరాత్ లయన్స్-రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ రాజ్కోట్
షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 8: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ‘తెలుగు తేజం’ పివి.సింధు క్వార్టర్ ఫైనల్లో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్న ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తొలి రెండు వారాలు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇటీవల ముగిసిన టి-20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా కాలి మడమకు తగిలిన గాయం నుంచి యువరాజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం. ‘యువరాజ్ రెండు వారాల పాటు మా జట్టుకు దూరమవడం విచారకరం.
ముంబయి, ఏప్రిల్ 8: తీవ్రమైన వర్షాభావంతో అల్లాడుతున్న మహారాష్టల్రో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ల నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన ఐపిఎల్ మ్యాచ్లను మరో చోటికి మార్చాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిఐఎల్) దాఖలవడమే ఇందుకు కారణం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సత్తా చాటేందుకు ఎనిమిది జట్లు
సన్నాహాలను ముమ్మరం చేశాయి. చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే నెట్స్లో శ్రమిస్తున్నారు. డిఫెండింగ్ చాంపి
ముంబయి, ఏప్రిల్ 7: ముంబయిలో ఈనెల 9న జరగాల్సిన తాజా ఐపిఎల్ సీజన్ తొలి మ్యాచ్కి లైన్ క్లియరైంది. ఈ మ్యాచ్ని నిర్వహించుకోవడానికి ముంబయి కోర్టు అంగీకరించింది. అయితే, మహారాష్టల్రో నెలకొన్న నీటి ఎద్దడి, ఐపిఎల్ మ్యాచ్ల నిర్వహణపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసును 12వ తేదీకి వాయిదా వేసింది.
* ప్రతి సీజన్లోనూ ఎక్కువ పరుగులు సాధించిన అత్యుత్తమ బ్యాట్స్మన్కు ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్గా పర్పుల్ క్యాప్లను బహూకరిస్తారు.
షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 7: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ప్రీ క్వార్టర్స్లో సైనా 21-10, 21-16 ఆధిక్యంతో బయె ఇయాన్ జూను ఓడించింది. మరో మ్యాచ్లో సింధు 22-20, 21-17 ఆధిక్యంతో సంగ్ జీ హ్యున్పై విజయం సాధించి క్వార్టర్స్ చేరింది.