-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇండియన్ వెల్స్: సుమారు 14 సంవత్సరాల తర్వాత ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టిన ప్రపంచ నంబర్ వన్ క్రీడా కారిణి సెరెనా విలియమ్స్కే మహిళల సింగిల్స్ టైటిల్ దక్కుతుందని విశే్లషకుల అభిప్రాయం. 2001లో ఇండియన్ వెల్స్ సెమీ ఫైనల్స్లో సెరెనా, ఆమె సోదరి వీనస్ విలియమ్స్ తలప డాల్సి వచ్చింది. అయతే, అప్పుడప్పుడే అంత ర్జాతీయ సర్క్యూట్లో తన ఉనికిని చాటుకుం టున్న సెరెనాను ఎదుర్కోలేదు.
కోల్కతా: పాకిస్తాన్తో శనివారం జరిగిన హై వోల్టేజీ టి-20 వరల్డ్ కప్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. విరాట్ కోహ్లీ అసాధారణ ప్రతి భ మరోసారి టీమిండియాకు విజయాన్ని అందించాడు. 18 ఓవర్లలో 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 13 బం తులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఆరు వికెట్ల తేడా తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తుచేసింది.
ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్, మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ మధ్య జరిగే మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇండియన్ వెల్స్ పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో వీరిద్దరూ తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో వీరిద్దరూ సులభంగా ప్రత్యర్థులను ఓడించి సెమీస్లోకి అడుగుపెట్టారు.
ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సుమారు 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండియన్ వెల్స్ పిఎన్బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. ఒకటిన్నర దశాబ్దాలు ఈ టోర్నీకి దూరంగా ఉన్న సెరెనా గత ఏడాది సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి మోకాలి గాయం కారణంగా వైదొలగింది. ఈ ఏడాది టైటిల్ వేటలో పడింది.
న్యూఢిల్లీ: మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్షిప్లో భాగంగా శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్లో భారత్ విజయావకాశాలను వర్షం దెబ్బతీసింది. మ్యాచ్ని అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి, డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగుల ఆధిక్యంలో ఉందని పేర్కొంటూ అంపైర్లు ఆ జట్టునే విజేతగా ప్రకటించారు.
ముంబయి: ఇంగ్లాండ్తో శుక్రవారం జరిగిన టి-20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్లో భారీ స్కోరును నమోదు చేసినప్పటికీ అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఆదివారం నాటి మ్యాచ్లో విజయంపై కనే్నసింది. అఫ్గానిస్థాన్తో జరిగే ఈ మ్యాచ్లో గెలవకపోతే నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు ప్రమాదంలో పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది.
న్యూఢిల్లీ: ఉద్ధేశ్యపూర్వకంగా బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ వ్యవహారాల నుంచి తప్పుకున్నాడు.
ముంబయి: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు సత్తా చాటుకుంది.
కోల్కతా, మార్చి 18: ఐసిసి వరల్డ్ కప్ టి-20 టోర్నమెంట్కు ముందు హాట్ఫేవరేట్గా నిలిచినప్పటికీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో ఊహించని విధంగా ఓటమి పాలయిన టీమిండియాకు శనివారం ఇక్కడ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను ఢీకొనబోతోంది. సెమీ ఫైనల్కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందనేది వాస్తవం.
ధర్మశాల: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో టీమిండియాను మట్టికరిపించి ఈ టోర్నీలో శుభారంభాన్ని సాధించిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం మధ్యాహ్నం ధర్మశాలలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది.