-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
నాగపూర్: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’లో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో జింబాబ్వే శుభారంభం చేసింది. హాంకాంగ్ను ఢీకొన్న ఈ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు సాధించింది.
ముంబయి: టి-20 వరల్డ్ కప్ చాంపియన్షిప్లో ఆతిథ్య దేశం భారత్ గెలుస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జోస్యం చెప్పాడు. కానీ, పోటీలో ఉన్న అన్ని జట్లూ విజయాలు సాధించాలన్న పట్టుదతోనే బరిలోకి దిగుతున్నాయని, కాబట్టి పోరు తీవ్రంగా ఉంటుందని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డాడు. ఫేవరిట్ అంటే తన ఉద్దేశంతో బలమైన జట్టని చెప్పాడు.
కొలంబో: శ్రీలంక సెలక్టర్లపై వేటు పడింది. బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్షిప్లో లంక జట్టు దారుణంగా విఫలమైన కారణంగా కపిల విజెగుణవర్దన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) ఆగ్రహంతో ఉంది. అందుకే కమిటీని రద్దు చేసి, మాజీ బ్యాట్స్మన్ అరవింద డిసిల్వ నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
మహిళల టి-20 వరల్డ్ కప్లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ గ్రూపుల్లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన జట్లు సెమీ ఫైనల్స్ చేరుతాయి.
కోల్కతా: భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి విమర్శించడం చాలా సులభమని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. క్రికెట్పై ప్రతి ఒక్కరికీ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని వ్యక్తీకరించడమేగాక, సలహాలు కూడా ఇస్తుంటారని బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకొని, సహచరులతో కలిసి ఇక్కడికి చేరుకున్న ధోనీ అన్నాడు.
న్యూఢిల్లీ: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. ధర్మశాల లేదా న్యూఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్లను మరో కేంద్రానికి మార్చే ఆలోచన ఐసిసికి లేదని తేల్చిచెప్పాడు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని అన్నాడు.
లండన్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడేందుకు భారత బాడ్మింటన్ స్టార్ సైనా సిద్ధమైంది. ఫిట్నెస్ సమస్యతో ఇటీవల కాలంలో పలు టోర్నీలకు దూరమైన సైనా క్వాలిఫయర్స్తో మంగళవారం నుంచి ఆరంభం కానున్న ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో పాల్గొననుంది. ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్యలు లేవని సైనా తెలిపింది.
నాగపూర్: టి-20 వరల్డ్ కప్లో భారత జట్టు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్ టోర్నీ టైటిల్ను కైవసం చేసుకున్న భారత్ మొత్తం 127 పాయింట్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా చెరి 118 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
ధర్మశాల: ధర్మశాలలో ఈనెల 19న జరిగే మ్యాచ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన పాకిస్తాన్ భద్రతా బృందం సోమవారం వాఘా సరిహద్దు మీదుగా అమృత్సర్కు వచ్చి, అక్కడి నుంచి ధర్మశాల చేరుకుంది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ లాహోర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫిసర్ విశ్రాంతి కల్నల్ అజాం ఖాన్ ఈ బృందంలో ఉన్నారు.
మీర్పూర్: వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో 15 ఓవర్లకు కుదించిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్షిప్ ఫైనల్లో బంగ్లాదేశ్ను ఢీకొన్న భారత్ సునాయాస విజయాన్ని సాధించి సత్తా చాటింది. చాలకాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతువన్న శిఖర్ ధావన్ అర్ధ శతకంతో రాణించగా, విరాట్ కోహ్లీ అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు.