-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 14: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్పై ఆస్ట్రేలియా పట్టు సంపాదించింది. ఆడం వోగ్స్ డబుల్ సెంచరీతో రాణించగా, మొదటి ఇన్నింగ్స్లో 562 పరుగుల భారీ స్కోరును సాధించిన ఈ జట్టు 379 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన కివీస్ మూడో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
విశాఖ:శ్రీలంకతో విశాఖలో ఆదివారం జరిగిన టి-20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 83 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్శర్మ వికెట్ కోల్పోయి 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. దీంతో 9 వికెట్ల తేడాతో భారత్ నెగ్గింది. ఇప్పటికే రెండు టి-20 మ్యాచ్లలో నెగ్గిన భారత్ మూడో మ్యాచ్నుకూడా కైవసం చేసుకుంది.
విశాఖపట్నం:భారత్ తో విశాఖలో జరుగుతున్న మూడో టి-20 మ్యాచ్లో శ్రీలంక 18 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయింది. టీ ట్వంటి మ్యాచ్లలో ఆ జట్టు అతిస్వల్ప స్కోరు ఇదే. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక విలవిలలాడింది. భారత స్పిన్నర్ ఎనిమిది పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టగా సురేశ్ రైనా రెండు, జడేజా, బుమ్రా, నెహ్రా చెరో వికెట్ తీశారు.
ఢాకా:ఢాకాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో విశ్వవిజేతగా వెస్టిండీస్ నిలిచింది. ఈ టోర్నీ ప్రారంభంనుంచి అప్రతిహత విజయాలతో ఫైనల్ చేరి ఎన్నో ఆశలు రేపిన భారతజట్టు ఫైనల్లో చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ టాప్ఆర్డర్ విఫలమవడంతో 45.1 ఓవర్లకే 145 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రాంచీ: యువరాజ్ సింగ్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి, ఐదు కంటే ముందు స్థానాల్లో బరిలోకి దించడం అనుకున్నంత సులభం కాదని భారత వనే్డ, టి-20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యువీ బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్కసారిగా మార్పు అసాధ్యమన్నాడు.
గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ముందుకు దూసుకెళుతున్నది. ట్రయథ్లాన్ పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణాలను కైవసం చేసుకొని, తనకు తిరుగులేదని చాటింది. శనివారం పోటీలు ముగిసే సమయానికి మొత్తం 268 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. వీటిలో 156 స్వర్ణం, 85 రజతం, 27 కాంస్యాలున్నాయి.
మీర్పూర్: అండర్-19 ప్రపంచ కప్లో టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న భారత జట్టు ఆదివారం వెస్టిండీస్తో జరిగే ఫైనల్లో హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగనుంది. మాజీ టెస్టు క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తున్న భారత అండర్-19 జట్టు ఈటోర్నలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నది. ఆటగాళ్లంతా మంచి ఫామ్ను కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులపై సులభంగానే విజయాలను సాధిస్తున్నది.
విశాఖపట్నం: మూడు మ్యాచ్ల టి- 20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్ ఆడేందుకు భారత్, శ్రీలంక జట్లు శనివారం విశాఖ చేరుకున్నాయి. విశాఖ ఎసిఎ - విడిసిఎ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు మూడో టి- 20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే చెరో మ్యాచ్లో విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు చివరి మ్యాచ్లో గెలుపొందడం ద్వారా సిరీస్ను కైవసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి.
గౌహతి: దక్షిణ ఆసియా క్రీడల్లో హాకీ టైటిల్ను గెలవడం, అందులోనూ ఫైనల్లో పటిష్టమైన భారత్ను ఓడించడం ఎంతో సంతోషంగా ఉందని పాకిస్తాన్ ఆటగాడు అవైసుర్ రెహ్మాన్ అన్నాడు. భారత్తో శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో పాకిస్తాన్ 1-0 తేడాతో భారత్ను ఓడించి టైటిల్ను అందుకున్న విషయం తెలిసిందే. ఏకైక గోల్తో పాక్ను గెలిపించిన రెహ్మాన్ శనివారం పిటిఐతో మాట్లాడుతూ సమష్టిగా పోరాడినందువల్లే టైటిల్ దక్కిందని అన్నాడు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు సంపాదించింది. ఆడం వోగ్స్, ఉస్మాన్ ఖాజా శతకాలు ఆ జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాయి. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 183 పరుగులకు ఆలౌట్కాగా, ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు చేజార్చుకొని 147 పరుగులు చేసింది.