S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/01/2016 - 05:26

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఈ ఏడాది చివరి ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత బౌలర్‌కు తొలిసారి టెస్టు బౌలింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానం లభించడం విశేషం. తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బంది పెడుతున్న రవిచంద్ర న్ అశ్విన్ నంబర్ వన్‌గా నిలవగా, బ్యాటింగ్ విభాగంలో టాప్ పొజిషన్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆక్రమించాడు.

01/01/2016 - 05:25

దుబాయ్, డిసెంబర్ 31: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టెస్టు బ్యాటింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. అతు 899 పాయింట్లు సంపాదించగా, ఫిబ్రవరిలో బ్రెండన్ మెక్‌కలమ్ రిటైర్‌కానుండగా, అతని స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్న కేన్ విలియమ్‌సన్ 889 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 888 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

01/01/2016 - 05:25

మాడ్రిడ్, డిసెంబర్ 31: రియల్ బెటిస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు బార్సిలోనా ఆటగాళ్లు ఈఏడాది తాము సాధించిన ట్రోఫీలతో ఫొటోలు దిగారు. 2015లో ఈ జట్టు స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాతోపాటు కోపా డెల్ రే, యూఫా చాంపియన్స్ లీగ్, యూఫా సూపర్ కప్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) క్లబ్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సాధించింది.

01/01/2016 - 05:30

మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణి అవార్డును పొందిన మిథాలీ రాజ్. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ భారత్ తరఫున పలు రికార్డులను నెలకొల్పింది. అత్యుత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది.

01/01/2016 - 05:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిసిసిఐ అవార్డు లభించింది. ఈఏటి మేటి క్రికెటర్‌గా అతు అవార్డును సొంతం చేసుకున్నాడు. జనవరి 5న ముంబైలో జరిగే కార్యక్రమంలో అతను అవార్డును స్వీకరిస్తాడు. మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మిథాలీ రాజ్‌కు లభించింది.

12/31/2015 - 16:20

న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఈ ఏడాది విశేషంగా రాణించిన కోహ్లికి పురుషుల కేటగిరీలో ఈ అవార్డు దక్కగా.. మహిళా కేటగిరీలో ఇచ్చే బెస్ట్ వుమెన్స్ అవార్డును మిథాలీ రాజ్ గెలుచుకుంది. 2015లో మెన్స్, వుమెన్స్ క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ తమ వార్షిక అవార్డులను ప్రకటించింది.

12/31/2015 - 06:38

దర్బన్, డిసెంబర్ 30: మోయిన్ అలీ స్పిన్ బౌలింగ్ ప్రతిభ దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ ముగిసిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్‌కు 241 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించింది. విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయాల్సి ఉండగా, మంగళవారం ఆఠ ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన బుధవారం ఉదయం ఆటను కొనసాగించి 174 పరుగులకు ఆలౌటైంది.

12/31/2015 - 06:36

రష్యాలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని, అథ్లెట్లతో వ్యూహాత్మకంగా డోపింగ్ చేయంచిందన్న వార్త క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఎంతో మంది మేటి అథ్లెట్లు డోపింగ్ దోషులేనని వాడా ఆధ్వర్యంలోని కమిటీ తేల్చి చెప్పడంతో నిషిద్ధ మాదక ద్రవ్యాల వినియోగంలో కొత్త కోణం ఆవిష్కృతమైంది. మరియా సవినొవా, లుడ్మిలా బియాన్‌స్కా, బిర్యుకోవా వంటి స్టార్లు డోపింగ్‌కు పాల్పడిన వారేనని వాడా కమిటీ తేల్చి చెప్పింది.

12/31/2015 - 06:35

స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో దోషులుగా తేరిన వారిపై ఆర్‌ఎం లోధా కమిటీ నిర్ణయాలు తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేసి సంవత్సరాల సస్పెన్షన్‌ను విధించింది. ఈ కేసులో వారివారి పాత్ర స్పష్టం కావడంతో, చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను జీవితకాలం సస్పెండ్ చేసింది.

12/31/2015 - 06:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) తత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ స్పష్టం చేశాడు. ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైటీ డిడిసిఎ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో భారీగా అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం చోటు చేసుకుందని బిజెపి నుంచి సస్పెన్షన్‌కు గురైన కీర్తీ ఆజాద్ ఆరోపించిన విషయం తెలిసిందే.

Pages