S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/28/2015 - 06:44

నాగ్‌పూర్, నవంబర్ 27: దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు శుక్రవారం 124 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

11/28/2015 - 06:39

కోల్‌కతా, నవంబర్ 27: అండర్-19 ట్రై సిరీస్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా జైత్రయాత్ర సాగిస్తున్న యువ భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శనతో అలరించింది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ జట్టును మట్టికరిపించి వరుసగా మరో విజయం సాధించిన భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

11/28/2015 - 06:38

మకావు, నవంబర్ 27: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ‘తెలుగు తేజం’ పివి.సింధు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇంతకుముందు రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సింధు శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయిపై చెమటోడ్చి విజయం సాధించింది.

11/28/2015 - 06:37

అడిలైడ్, నవంబర్ 27: మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ మైదానంలో శుక్రవారం ప్రారంభమైన చరిత్రాత్మక డే అండ్ నైట్ మ్యాచ్ (చివరి టెస్టు)లో తొలి రోజు ఎంతో ఆహ్లాద భరితంగా సాగింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్ బాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తారు. 47,441 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజే 12 వికెట్లు కూలాయి.

11/28/2015 - 06:36

నాగపూర్, నవంబర్ 27: స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లను తయారు చేయాలన్న పాలసీ ఏదీ లేదని, అయితే, పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఎప్పటికే మ్యాచ్‌ని గెలిచే బౌలర్లను తయారు చేయలేమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసాడు. ‘ అది ఒక పాలసీ కాదు. అయితే భారత్‌లో ఉండే పరిస్థితి అది. లేదంటే 500కు పైగా పరుగలు చేసే పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌లు అడాల్సి ఉంటుంది..

11/28/2015 - 06:35

వలెట్టా (మాల్టా), నవంబర్ 27: పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు బిసిసిఐ ప్రభుత్వ అనుమతిని కోరిన రెండు రోజులకు ప్రభుత్వం ఈ విషయం తెలియజేయడం గమనార్హం.

11/27/2015 - 15:50

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

11/27/2015 - 07:14

న్యూఢిల్లీ, నవంబర్ 26: రోజుకో మలుపు తిరుగుతూ చాలాకాలంగా ఉత్కంఠ సృష్టిస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్ వచ్చేనెల 15 నుంచి శ్రీలంకలో జరగడం దాదాపు ఖాయమైంది.

11/27/2015 - 07:13

రెండో రోజు కూలిన 20 వికెట్లు *భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టు

11/27/2015 - 07:13

మొదటి డే/నైట్ టెస్టుకు అడెలైడ్ రెడీ

Pages