S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/22/2020 - 04:40

హైదరాబాద్, మార్చి 21: ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ నిజంగా కరోనా వైరస్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌నాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

03/22/2020 - 04:22

తిరుపతి, మార్చి 21: కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించకపోయినా శ్రీవారి కైంకర్యాలు వైఖానస ఆగమోక్తంగా యధాతథంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వైఖానస సభ గోశాస్త్ర ప్రకారం తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారికి అనేక వేల సంవత్సరాల నుంచి ఆరాధనలు జరుగుతున్నాయన్నారు.

03/22/2020 - 01:15

హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధమయ్యాయి. స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూకు మద్దతు పలకాలని అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం నాడు ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనున్నది. అత్యవసర సేవలకు మాత్రం ప్రజలు ఇంటి నుంచి బయటపడాలని సూచించడంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు.

03/20/2020 - 12:50

హైదరాబాద్: ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు రక్షణ కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పనిచేసే కేంద్ర అధికారులను బెదిరించటం సరికాదని అన్నారు. ఆయన తనకు భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాసిన లేఖ అందిందని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు.

03/20/2020 - 05:17

అన్నవరం, మార్చి 19: శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదేవునికి ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాత సేవ, హారతి సేవ, నిత్య కల్యాణంతోపాటు ఆర్జిత సేవలు, భక్తులు సామూహికంగా నిర్వహించుకునే వ్రతాలను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా శుక్రవారం నుండి రద్దు చేస్తున్నట్టు గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.

03/20/2020 - 05:15

హైదరాబాద్, మార్చి 19: వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్టై సెర్బియా జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విడుదలై గురువారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. వాన్‌పిక్ వ్యవహారంలో జైలుకు వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఆయన విడుదలై హైదరాబాద్‌కు వచ్చారు.

03/20/2020 - 00:29

తిరుపతి, మార్చి 19: నిరంతరం నిత్యకల్యాణం, పచ్చతోరణంగానూ, వేలాది మంది భక్తులతోనూ, వారి గోవిందనామస్మరణలతో మార్మోగే కలియుగ ప్రత్యక్షదైవంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్న తిరుమల క్షేత్రం శుక్రవారం నుంచి పూర్తిగా నిర్మానుష్యం కానుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా తాకింది.

03/19/2020 - 17:14

హైదరాబాద్: కరోనా భయంతో పలు ఆలయాల్లో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుమల పైకి వచ్చే ఘాట్ రోడ్డులను మూసివేశారు. దిగువకు వచ్చే ఘాట్ రోడ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అలిపిరి గరుడ సర్కిల్ నుంచి వచ్చే భక్తులను వెనక్కి పంపుతున్నారు. కొండపై నుంచి వాహనాలన్నీ దిగువకు వచ్చాక ఘాట్ రోడ్డును అధికారులు మూసివేయనున్నారు. అలాగే ఏపీలో మరొక పుణ్యక్షేత్రమైన అన్నవరంలోవ్రతాలను నిలిపివేశారు.

03/19/2020 - 05:54

కర్నూలు శ్రీశైలంలో ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ఉగాది ఉత్సవాల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో శ్రీశైలం తరలిరాకుండా చర్యలు తీసుకోవాలని 14 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశామని ఆయన పేర్కొన్నారు.

03/19/2020 - 05:51

విశాఖపట్నం, మార్చి 18: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధితో యావత్ ప్రజానీకం విలవిల్లాడుతోంది. మహమ్మారి వైరస్ దావాలనంలా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తోంది. ఆరోగ్య పరంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దైవానుగ్రహం కూడా ప్రజలకు మేలు చేస్తుందన్న భావనతో విశాఖ శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో విషజ్వర పీడ హర యాగం, అమృత పాశుపతయాగాలను పీఠప్రాంగణంలో బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు.

Pages