-
హైదరాబాద్, నవంబర్ 8: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు డార్క్ వెబ్ అడ్డాగా మారిందన
-
హైదరాబాద్, నవంబర్ 8: విశాఖపట్నం నుంచి శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట
-
హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రతిష్టా
-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ సోమవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థాన మండపం నుంచి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకువచ్చారు.
విశాఖపట్నం, డిసెంబర్ 2: డోర్నీయర్ విమానాలు నడిపే శిక్షణా కార్యక్రమంలో ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బ్యాచ్లో ఒక మహిళా పైలెట్ ఉండటం విశేషం. సబ్ లెఫ్టినెంట్ శివంగి ఈ రకమైన శిక్షణ పూర్తి చేసుకుని భారత నౌకాదళంలో తొలి మహిళా పైలెట్గా చరిత్ర సృష్టించి రికార్డులకెక్కారు.
హైదరాబాద్ డిసెంబర్ 2: వచ్చే మార్చి ఆఖరి నాటికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సి ఉంటుందని సింగరేణి ఏరియా మేనేజర్లకు సంస్థ సీఎండీ శ్రీ్ధర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సీఎండీ శ్రీ్ధర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వచ్చే నాలుగు మాసాలు కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
షాద్నగర్, డిసెంబర్ 2: జస్టిస్ ఫర్ దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి షాద్నగర్ మీదుగా కర్నూల్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు షాద్నగర్ బైపాస్ వద్ద స్థానిక టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు.
గణపురం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని జర్మన్ శ్రీ సాయి ప్రాణయోగ నిర్వాహకుడు చెల్లేటి సాయిరెడ్డి అన్నారు. ఆదివారం 40 మంది జర్మనీకి చెందిన యోగా బృందం గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించారు. గత నెలరోజులుగా శ్రీ సాయి ప్రాణయోగ బృందం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? తెలియక 55 రోజులుగా టెన్షన్ పడిన ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అది ఎంతగా అంటే... వారే ఆశ్చర్యపోయే విధంగా వరాలు ఇవ్వడంతో కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయా? అన్నంతగా... ఆదివారం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారితో కలిసి భోజనం చేశారు. అడక్కుండానే ఏకంగా 26 వరాలను కురిపించేశారు.
తిరుపతి: హిందువుల మనోభావాలను దెబ్బతీసి మత కలహాలను సృష్టించడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని, వారి ఆటలు సాగనివ్వబోమని, టీటీడీ వెబ్సైట్లో యేసయ్య అనే పదం ఎప్పుడూ లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పద్మావతి అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుపతి, డిసెంబర్ 1: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచానూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పద్మసరోవరంలో ముక్కోటి పంచమి శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా సాగింది.
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన శనివారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 7.55 గంటలకు వృశ్చికలగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి.
నాగార్జునసాగర్, నవంబర్ 30: నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చే పర్యటకుల భద్రతే ముఖ్యమని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాధరావు అన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో శనివారం నాడు నాగార్జునసాగర్ నుండి కృష్ణా నదిలో శ్రీశైలానికి ఏర్పాటు చేసిన లాంచీ ప్రయాణాన్ని స్థానిక ఎఫ్డీఓ గోపిరవితో కలిసి ఆయన ప్రారంభించారు.