-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
అమరావతి, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసేందుకు ఉన్న అవకాశాలను అనే్వషించి అధ్యయనం చేయడానికి టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంటున్నట్టు రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఖమ్మం, నవంబర్ 16: అధికారం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడిన వారికే రైతు సమన్వయ సమితుల్లో(ఆర్ఎస్ఎస్) స్థానం కల్పించామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా ఖమ్మం జిల్లా సమితిలో ఒక్కరు కూడా ఉద్యమ నేత లేకపోవడం గమనార్హం.
హైదరాబాద్, నవంబర్ 15: రైళ్ల సమయపాలనతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యదవ్ రైల్వే అధికారులకు సూచించారు. బుధవారం సికిందరాబాద్లోని రైల్ నిలయంలో ఆరు డివిజన్లకు చెందిన మేనేజర్లు, ముఖ్య విభాగాలకు చెందిన అధికారులతో ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో రైల్వే భద్రతపై ప్రధానంగా చర్చించారు.
విశాఖపట్నం, నవంబర్ 15: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారింది. ఇది విశాఖకు దక్షిణంగా 170 కిలో మీటర్ల దూరంలో, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని ఈశాన్య దిశగా కదులుతున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలియచేశారు. ఈ వాయుగుండం మరో 24 గంటల తరువాత క్రమేపీ బలహీనపడనుంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్, నవంబర్ 15: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో రిటైర్డు ఐఎఎస్ అధికారి ఎస్ఎన్ మహంతిపై సిబిఐ మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మహంతికి పాక్షికంగా ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం మహంతిని ప్రాసిక్యూషన్కు చేసేందుకు సిబిఐకు అనుమతి ఇవ్వకపోయినా, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను సిబిఐ దాఖలు చేయడం చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.
విశాఖపట్నం, నవంబర్ 15: రాష్టప్రతి రాజ్నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చే నెల 7న విశాఖకు వస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్శిటీకి వస్తారు. వర్శిటీలోని సౌత్ క్యాంపస్లో కొత్తగా నిర్మించిన జిమ్నాజియంను రాష్టప్రతి ప్రారంభిస్తారు. నార్త్ క్యాంపస్లోని కంప్యూటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
హైదరాబాద్, నవంబర్ 15: భద్రాచలం రోడ్డు నుండి కొవ్వూరు, సత్తుపల్లి, కొండపల్లి ప్రాంతాలకు రైల్వై లైన్ వేసేందుకు గతంలో రూపొందించిన మూడు ప్రతిపాదనల్లో స్వల్పమార్పులు చేర్పులు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 954 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో బుధవారం రైల్వేలైన్ల తీరుతెన్నులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 15: కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. వచ్చే నెలలో సిఎం కె చంద్రశేఖరరావు ప్లాంట్ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 36 నెలల్లో థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తికావడం విశేషం. ఈ ప్రాజెక్టును బిహెచ్ఇఎల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు రూ. 3810 కోట్ల వ్యయమైంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ ప్రాతిపదికన ప్లాంట్ను నిర్మించారు.
హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలోని విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ చదువుకున్నా ఫీజు రీయంబర్స్మెంట్ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయంబర్స్మెంట్పై దుమారం చెలరేగింది. ఈ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని విపక్షాలు మండిపడ్డాయి.
విశాఖపట్నం, నవంబర్ 15: వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐఐ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, డల్బెర్గ్ సంయుక్తంగా విశాఖలోని సిఐఐ గ్రౌండ్స్లో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017ను ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు.