S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/29/2017 - 01:45

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలని, అంతర్జాతీయంగా తెలంగాణ ఖ్యాతి వెల్లివిరిసేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు (సాంస్కృతిక వ్యవహారాలు) కెవి రమణాచారి పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

10/29/2017 - 01:40

హైదరాబాద్, అక్టోబర్ 28: ‘కొలువుల కొట్లాట’ పేరిట 31న నిరుద్యోగులు, విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతంలోనూ కోదండరామ్ నిర్వహించాలనుకున్న సభను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

10/29/2017 - 01:39

అమరావతి, అక్టోబర్ 28: టిడిపినుంచి నిష్క్రమించిన తెలంగాణ యువనేత రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ పరిశీలిస్తే, నిష్క్రమణ వేదనాభరితంగానే సాగినట్టు స్పష్టమవుతోంది. ఊహించినదానికి భిన్నంగా తన మూడుపేజీల లేఖలో బాబుపై ప్రేమానురాగాలే ప్రదర్శించారు. బాబుపై తనకున్న ప్రేమాభిమానాలు చూపిస్తూనే, కార్యకర్తలంటే ప్రాణమంటూ గౌరవంగా నిష్క్రమించారు.

10/29/2017 - 01:36

అమరావతి, అక్టోబర్ 28: ఊహించినట్టే.. తెలంగాణ తెలుగుదేశం యువనేత రేవంత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

10/29/2017 - 01:26

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆంధ్ర, తెలంగాణకు ప్రాణాధారమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మొత్తం 530 టిఎంసి సామర్థ్యానికి 475 టిఎంసి నీటి లభ్యత ఉండడంతో ఈ ఏడాది నీటి వినియోగంపై కృష్ణాబోర్డు కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 3 శనివారం ఇక్కడ కృష్ణా బోర్డు సమావేశమై నీటి కేటాయింపులను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి పరమేశన్ రెండు రాష్ట్రాలకు తెలియచేశారు.

10/29/2017 - 01:24

కొత్తపేట/ బత్తలపల్లి, అక్టోబర్ 28: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు చిట్టూరిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు మహిళలు మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల పరిధిలోని అనంతపురం-కదిరి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

10/29/2017 - 01:21

రాజమహేంద్రవరం, అక్టోబర్ 28: కడప జిల్లా రామరాజుపల్లిలోని ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థులు అధైర్యపడొద్దు.. మరోసారి కోర్టును అభ్యర్థిచే అంశాన్ని ఢిల్లీ వెళ్లి పరిశీలిస్తామని ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఫాతిమా విద్యార్థులకు ఏదో విధంగా న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.

10/29/2017 - 01:19

విశాఖపట్నం, అక్టోబర్ 28: నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కు తగ్గడంతో ఈశాన్య రుతుపవనాలు ఏపి, తమిళనాడులోకి చొచ్చుకు వస్తున్నాయి. ఈనెల 24న ఒడిశాలోని కొరాపుట్‌లో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు, 27 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తిగా విస్తరించినట్టు ఆంధ్రా యూనివర్శిటీ ఓష్ణోగ్రఫీ విశ్రాంత ఆచార్యులు భానుకుమార్ తెలియచేశారు.

10/29/2017 - 01:18

విజయవాడ, అక్టోబర్ 28: కర్మభూమికి తోడ్పడండి.. జన్మభూమి అభివృద్ధికి సహకరించండి.. అంటూ విదేశాల్లోని తెలుగువారికి పిలుపు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తొమ్మిది రోజుల పాటు అమెరికా, యుఎఇ, బ్రిటన్‌లో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటించి, రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత, తన పర్యటన వివరాలను విజయవాడ సిఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

10/28/2017 - 02:26

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ టిడిపి వ్యవహారాలపై చర్చించేందుకు 28న శనివారం అమరావతికి రావాలని, అక్కడే ఇటీవలి పరిణామాలపై చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.

Pages