S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/20/2020 - 23:54

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెలికాప్టర్ సర్వీసులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేట్ విమానాశ్రయంలో గురువారం ప్రారంభించారు.

02/20/2020 - 04:03

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) కు చెందిన వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగం నుండి వచ్చిన 14 మంది ప్రతినిధులతో తమిళిసై బుధవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు.

02/20/2020 - 03:58

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ , ఎం ఆర్క్ తదితర పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి మే 28వ తేదీ నుండి 31వ తేదీ వరకూ పీజీఈసెట్ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి , కన్వీనర్ ప్రొఫెసర్ ఎం కుమార్‌లు తెలిపారు. పీజీఈసెట్ ఫలితాలను జూన్ 15న విడుదల చేస్తామని ఆయన చెప్పారు. బుధవారం నాడు పీజీఈసెట్ షెడ్యూలును ఆయన విడుదల చేశారు.

02/20/2020 - 03:58

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు బీపీఈడీ, డీపీఈడీల్లో ప్రవేశానికి మే 13వ తేదీ నుండి పీఈసెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదల చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులను అదే రోజు నుండి స్వీకరిస్తారు.

02/20/2020 - 01:31

వేములవాడ/వేములవాడటౌన్, ఫిబ్రవరి 19: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడురోజుల జాతరకు దేవాదాయ శాఖ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు కోటి 30 లక్షల రూపాయలను దేవాదాయ శాఖ కేటాయించింది.

02/20/2020 - 00:49

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వచ్చే పదేళ్లలో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అన్నారు. 2020-21 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అనే అంశంపై ప్రజ్ఞ్భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు.

02/19/2020 - 04:56

గుంటూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం వారాలు గడిచినా చెల్లించలేదేమని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరిస్తున్నారన్నారు.

02/19/2020 - 04:23

అమరావతి, ఫిబ్రవరి 18: వివిధ రాష్ట్రాల్లో కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)పై అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది.

02/19/2020 - 01:51

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 18: సమస్త భూత గణాలకు ఆధిపత్యం వహిస్తున్న ముక్కంటీశ్వరుడు సూర్యప్రభ, చప్పర వాహనాలపై భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు జరిగే ఉత్సవాలను భూతరాత్రి అంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీ వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి చండికేశ్వరుడితో కలిసి చతుర్మాడ వీధులలో అంగరంగ వైభవంగా ఊరేగారు.

02/19/2020 - 01:47

శ్రీశైలం, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీగిరిపై మంగళవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి వార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై ఆశీనులను జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హారతుల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

Pages