-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 6: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష బాబూ జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు తొలి దశ పెదపూడి రిజర్వాయర్ను 2019 ఎన్నికలకు ముందే ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా మూడు రోజులపాటు నిర్వహించే ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని బుధవారం విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సాపురం వద్ద శారదానదికి హారతిచ్చి పూజలు నిర్వహించడం ద్వారా ప్రారంభించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 6: అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న చంద్రన్న బీమా పథకంలో సహజ మరణానికి చెల్లించే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖ జిల్లా కశింకోట మండలంలో నిర్వహించిన జలసిరికి హారతిలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6: బెజవాడ కనుకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మొక్కు చెల్లించడానికి 27న సిఎం కె చంద్రశేఖర్రావు విజయవాడకు వెళ్లనున్నారు. ఈమేరకు విజయవాడ పర్యటన ఖరారైనట్టు అధికార వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని పలువురు దేవుళ్లకు కెసిఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మొక్కులలో భాగంగా బెజవాడ కనుకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక సమర్పించాల్సి ఉంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 6: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ. 20,146 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. నిధుల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది జల విద్యుదుత్పాదన పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క జూరాల విద్యుత్ ప్రాజెక్టు నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడం, ఎగువ రాష్ట్రాల నుంచి ఆశించిన స్ధాయిలో నీటి విడుదల లేకపోవడంతో జల విద్యుదుత్పత్తి పూర్తిగా అంచనాలు తప్పింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 6: నూతన సంవత్సరం కానుకగా మిషన్ భగీరథ పథకం ద్వారా జనవరి 1నుంచి ఇంటింటికీ తాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మిషన్ భగీరథ పథకం పురోగతిపై మంత్రులు సమీక్షించారు.
మేడ్చల్/మహేశ్వరం, సెప్టెంబర్ 6: ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసి తెలంగాణకు విమోచన కల్పిస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కె. చంద్రశేఖర్ రావు తన స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని బిజెపి జాతీయ నేత, కేంద్ర ఆహార ఉత్పత్తి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మండిపడ్డారు.
జై గణేశా... జై జై గణేశా... నినాదాలతో రాజధాని పురవీధులు పులకించిపోయాయ. పదకొండు రోజుల పాటు నిత్యపూజలు అందుకున్న గణనాథుల నిమజ్జన యాత్ర శోభాయమానంగా సాగింది. నిమజ్జనానికి తరలుతున్న వేలాది గణనాథులను తిలకించేందుకు భక్తజనం పోటెత్తింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన గణనాథులను తనివితీరా తిలకించేందుకు వచ్చిన భక్తులతో ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయ.
హైదరాబాద్, సెప్టెంబర్ 5: ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ..జై, గణపతి బప్పా మోరియా..’ భక్తజనం నినాదాలతో భాగ్యనగరం పులకించి పోయింది. గత 11రోజులుగా పూజలందుకున్న వినాయకుడికి భక్తులు వీడ్కోలు పలికారు. అనంత చతుర్దశి సందర్భంగా మంగళవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్వర్యంలో కన్నుల పండువగా శోభాయాత్ర సాగింది. శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలి వచ్చారు. నగరంలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి.
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 5: వరద సీజను డిమాండును దృష్టిలో ఉంచుకుని ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. గోదావరి నది ఇసుకకు శ్రేష్ఠమైనదిగా నిర్మాణ రంగంలో పేరుంది. గోదావరి నది వరద పోటుతో ఉండటంతో ప్రస్తుతం చాలా ర్యాంపుల్లో ఇసుక తీసేందుకు అనుమతిలేదు.