-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
ఖమ్మం, జూలై 20: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. రెండు రోజుల క్రితం 22 అడుగులకు చేరుకున్న గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టి తిరిగి పెరుగుతోంది. గురువారం రాత్రికి 36 అడుగులకు చేరుకుంది. ఎగువ భాగంలోని ఛత్తీస్గఢ్, మహారాష్టల్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రావతి, తాలిపేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
విజయవాడ (క్రైం), జూలై 20: దళిత బిడ్డ, విద్యా కోవిదుడు రామనాథ్ కోవింద్ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్టప్రతిగా ఎన్నిక కావడం సంతోషకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారత దేశం వివిధ జాతులు, మతాల సమాహారమని, ఇలాంటి సాంఘిక జీవన వైవిధ్యం మరే దేశంలో కనిపించదని అన్నారు. ఇంతటి వైవిధ్యమున్నా మనందరం ఒకటిగా ఉండటమే మన దేశం ఘనతగా పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చిత్తూరు, జూలై 20: రాష్టప్రతిగా రామ్నాధ్కోవింద్ ఎన్నిక కావడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా గుడుపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో సిఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్టప్రతి రామ్నాధ్ కోవింద్ గెలిచినట్టు సమాచారం అందడంతో ఆయనకు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యున్నత పదవికి ఎన్నికలు జరగడం బాధాకరమన్నారు.
హైదరాబాద్, జూలై 20: రాష్టప్రతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వేర్వేరు ప్రకటనల లో శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్న ఆశాభావాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూలై 20: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బహుమతులు, ఇంక్రిమెంట్ల పేర్లతో ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో 124 మందికి, రాష్టస్థ్రాయిలో హెచ్ఓడిల నుండి నలుగురికి, రాష్ట్ర సచివాలయం నుండి నలుగురికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. శాస్ర్తియంగా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేస్తారు.
హైదరాబాద్, జూలై 20: వరంగల్ జిల్లాలో 1200 ఎకరాల్లో నిర్మించనున్న మెగా టెక్స్టైల్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అనుమతులు లభించడంతో నిర్మాణం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయ మెగా టెక్స్టైల్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ సమకూర్చింది. వచ్చే 15 రోజుల్లో నిర్మాణం పనులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్, జూలై 20: శ్రీరామ్సాగర్ (ఎస్ఆర్ఎస్పి) కాలువల ఆధునీకరణ పనులకు మరో రూ.750 కోట్లు మంజురు చేయనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. ఈ మేరకు రెండు రోజులలో సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఎస్ఆర్ఎస్పి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పి కాలువ పనులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.
విజయవాడ (క్రైం), జూలై 20: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ బాల కుటుంబరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
అమరావతి, జూలై 20: ‘బాబూ గోపాల్.. నాపేరు ఉదయలక్ష్మి. ఐఎఏఎస్ ఆఫీసర్ను. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని. కాపు కార్పొరేషన్ నీకు స్కాలర్షిప్ ఇస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. అందిందా.. జూమ్ టెక్నాలజీలో నువ్వు నేర్చుకుంటున్నావా?’
‘అబ్బే లేదు మేడమ్. నాకెలాంటి స్కాలర్షిప్ రాలేదు. అసలు ఆ కోచింగ్ సెంటర్ ఎక్కడుందో కూడా నాకు తెలియదండి’
హైదరాబాద్, జూలై 20: సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంపై విచారణలో భాగంగా రెండో రోజు గురువారం కెమెరామెన్ (సినీమాటోగ్రఫి) శ్యాం కె నాయుడును సిట్ అధికారులు విచారించారు. ఐదున్నర గంటలపాటు సాగిన విచారణలో నాయుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.