-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
శేరిలింగంపల్లి, జూన్ 17: భారీ భూ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో నిందితులైన ఇద్దరికి మియాపూర్లోని కూకట్పల్లి 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పలు షరతులు విధించింది.
హైదరాబాద్, జూన్ 17: ప్రయాణికుల సౌకర్యార్థం సికిందరాబాద్-విజయవాడ-సికిందరాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఆదివారం నుంచి మంగళగిరిలో అదనపు స్టాప్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి ఎం ఉమాశంకర్కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 07757 సికిందరాబాద్-విజయవాడ ఉ.గం. 10:00కు ఒక నిముషం పాటు మంగళగిరిలో ఆపుతారని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి-జమ్ముతావి
హైదరాబాద్, జూన్ 17: ఒక కేసులో విశాఖ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పోరేషన్ పూర్వ చైర్మన్ ప్రవీణ్కుమార్పై దాఖలైన కోర్టు ధిక్కారం కేసును హైకోర్టు స్వీకరించింది. ఈ కేసులో ప్రవీణ్కుమార్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖపట్నం భరత్నగర్లో 14 గుడిసెలను కూల్చివేసేందుకు అనుమతించారనే అభియోగం హైకోర్టులో దాఖలైంది.
పటన్చెరు, జూన్ 17: తెలంగాణ ప్రపంచంలోనే అత్యుత్తమ మెడికల్ హబ్గా మారబోతోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రామాణికమైన వైద్య పరికరాల తయారీలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న పార్క్ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్, జూన్ 17: రెవిన్యూ శాఖలో డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా 137 కొత్త పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీసు కమిషన్ను ఆదేశించిన ప్రభుత్వం తాజాగా మరో 2506 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ కమిషనర్ ల్యాండ్ రెవిన్యూలో 13 సీనియర్ స్టెనోలు, 109 జూనియర్ అసిస్టెంట్లు, 15 జూనియర్ స్టెనోల భర్తీకి ప్రభుత్వం జీవో 102ను జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 17: రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నాలుగు ఆర్డినెన్స్లను రాష్ట్ర మంత్రిమండలి శనివారం ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
అమరావతి, జూన్ 17: ఎట్టకేలకు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి పేరును టిడిపి నాయకత్వం ఖరారు చేసింది. శనివారం రాత్రి వరకూ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కర్నూలు జిల్లా పార్టీ నేతల సమావేశంలో, పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును బాబు ఖరారు చేశారు. కాగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించేందుకు నేతలు అంగీకరించినట్లు సమాచారం.
హైదరాబాద్, జూన్ 17: కాశ్మీర్లోయలో మానవ హక్కుల పరిరక్షణకు భారత సైన్యం పెద్దపీట వేస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కాశ్మీర్లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులపై రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలను ఆర్మీ పట్టించుకోదని, ఆర్మీకి భారత ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని సాధించడమే కర్తవ్యమని రావత్ అన్నారు.
అమరావతి, జూన్ 17: రెండోదశ విద్యుత్ సంస్కరణల అమలుతో విద్యుత్ వ్యయం తగ్గిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించే పరిస్థితులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన నాలుగు భారీ సోలార్ విద్యుత్ పార్కుల్లో అనంతపురంలోని 250మెగావాట్ల ప్లాంట్ పూర్తికావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి, జూన్ 17: రాష్ట్రంలోని ఏడు జిల్లాల రైతాంగానికి శుభవార్త. చాలాకాలం నుంచి రైతులు ఎదురుచూస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా చెల్లింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు తెరదింపేందుకు మొత్తం 1680కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.