S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/21/2017 - 01:24

గుంటూరు, మార్చి 20: శాసనసభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు రెయిన్‌గన్స్‌ను ఆరోపణాస్త్రంగా సంధించారు. రాయలసీమ ప్రాంతంలో కరవును అధిగమించేందుకు ప్రభుత్వం నిరుడు రెయిన్‌గన్స్‌ను ప్రవేశపెట్టింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం దీనిపై వివరణ ఇచ్చారు.

03/21/2017 - 01:19

గుంటూరు, మార్చి 20: రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో తమదే విజయం తమదేనని, తానే మళ్లీ ముఖ్యమంత్రినవుతానని సి ఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్న తమకే ఓట్లడిగే అధికారం ఉందని ఆయన అన్నారు.

03/20/2017 - 23:54

విశాఖపట్నం, మార్చి 20: విద్యుత్ బిల్లుల చెల్లింపు విధానం మరింత సరళీకృతం కానుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడిసిఎల్) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వినియోగదారుల సమయం వృథా కాకుండా క్షణాల్లో కరెంటు బిల్లులు చెల్లించడానికి ఎనీ టైం పేమెంట్ మిషన్ (ఏటిపిఎం)లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

03/20/2017 - 03:20

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలవడానికి దోహదపడిన పారిశ్రామిక విధానాన్ని ఆయన ఆసక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును అడిగి తెలుసుకున్నారు.

03/20/2017 - 01:50

హైదరాబాద్/ఎల్‌బినగర్, మార్చి 19: సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘సమర సమ్మేళనం’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు తెలంగాణ రాష్ట్రంలో 93 శాతానికి పైగా ఉన్నారని, వారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆరోపించారు.

03/20/2017 - 01:44

హైదరాబాద్, మార్చి 19: నిరుద్యోగ నిరసన ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నందున, ఇక జనంలోకి వెళ్లి ప్రభుత్వ దమననీతిని ఎండగట్టాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. మేలోగా జెఎసి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించింది.

03/20/2017 - 01:42

మహబూబ్‌నగర్, మార్చి 19:పాలమూరు ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఆదివారంనాడు విలేఖరుల సాక్షిగా రచ్చకెక్కాయి. తనకు మంత్రి పదవి రాకుండా ఎంపి అడ్డుకున్నారంటూ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ధ్వజమెత్తగా రుజువు చేస్తే రాజీనామా చేస్తానంటూ ఎంపి సవాల్ విసిరారు. ఇద్దరు నేతల వివాదం చూసి విలేఖరులతోపాటు అక్కడే ఉన్న పార్టీ నేతలు విస్తుబోయారు.

03/20/2017 - 01:37

విజయవాడ, మార్చి 19: శాసనమండలికి ఉపాధ్యాయ పట్ట్భద్రులు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 8 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. తొలిదశలో ఉత్తరాంధ్రలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, కర్నూలు, కడప జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ పట్ట్భద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

03/20/2017 - 01:35

విజయవాడ, మార్చి 19:రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరో 10 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో దాదాపు 10వేల కోట్ల రూపాయల మేరకు ఆదాయం రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆర్థిక లావాదేవీలపై పడింది. ఇటీవలి కాలంలో నగదు కొంతమేర అందుబాటులో ఉండటంతో లావాదేవీలు గతంలో కంటే ఎక్కువయ్యాయి.

03/20/2017 - 01:30

భీమవరం, మార్చి 19:అంగన్‌వాడీ సేవలు మరింత పారదర్శకం కానున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్టవ్య్రాప్తంగా ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ కొత్త విధానం అన్ని ప్రాజెక్టుల్లో అమలుకానుంది. ఇందుకోసం ఐసీడీఎస్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Pages