-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలపై పడిన ప్రభావాన్ని నీతి అయోగ్తో అధ్యయనం చేయించాలని, రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని కేంద్రమే భరించాలని సిఎం కె చంద్రశేఖర్రావు కేంద్రాన్ని కోరనున్నారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్రాలపై పడిన ప్రభావాన్ని ప్రధాని మోదీకి వివరించడానికి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 18: రద్దయిన పెద్ద నోట్లలో ఉన్న తమ నల్ల ధనాన్ని కొంతమంది ఇతరుల జన్ధన్ బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల పట్ల కేంద్రం అప్రమత్తమయింది. ఇతరుల పాత నోట్లను తమ ఖాతాలలో జమ చేయడం ద్వారా తమ ఖాతాలను దుర్వినియోగం చేస్తే ఆదాయపు పన్ను చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని జన్ధన్ ఖాతాదారులను, గృహిణులను, చేతివృత్తుల వారిని ప్రభుత్వం శుక్రవారం హెచ్చరించింది.
హైదరాబాద్, నవంబర్ 18: ప్రజా ప్రయోజనాల నిమిత్తం తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన భూ యజమానులకు 2013 భూ సేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూరర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం సత్యనారాయణతో కూడిన ధర్మాసనం వెలువరించింది.
విజయవాడ, నవంబర్ 18: రాష్ట్రం చిల్లర నోట్ల సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో 10 వేల కోట్ల చిన్న నోట్లను పంపాలని రిజర్వు బ్యాంక్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇ-పోస్ యంత్రాలను 80 శాతం రాయితీపై సరఫరా చేయాలని, ఆన్లైన్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్, నవంబర్ 18: నగదు మార్పిడి, ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం రోజుకో రీతిన మార్గదర్శకాలు జారీ చేస్తుండటంతో పనిలో పనిగా బ్యాంకులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఖాతాలో నగదు మార్పిడిని రోజుకు 2500 రూపాయలకు కుదించడంతో బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది అందుకు అడ్డదారులను కనిపెట్టేశారు.
విశాఖపట్నం, నవంబర్ 18: నల్లధనం వెలికితీతలో రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తొలి అడుగు మాత్రమేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం వెలికితీసే క్రమంలో భవిష్యత్లో మోదీ తీసుకునే నిర్ణయాలు దేశ గతినే మార్చేస్తాయన్నారు.
హైదరాబాద్, నవంబర్ 18: చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు సరిపడా నగదు లభించక అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామికవాడలు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి. ఇక్కడ దాదాపు లక్షల సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్లతో పాటు నేపాల్కు చెందిన వారు అనేక మంది ఉన్నారు.
హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 18: చదువులో మరింత రాణించాలంటూ ఉపాధ్యాయులు చేసిన ఒత్తిడి భరించలేక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మోతీనగర్లో నివాసం ఉండే ఎల్లయ్య బోరబండలోని ప్రభుత్వ పాఠశాల టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమార్తె శ్రీ వర్ష (17)ను గత సంవత్సరం ఎస్ఆర్ నగర్లోని నారాయణ కాలేజీలో చేర్పించారు.
కడప, నవంబర్ 18: ర్యాగింగ్ భూతం మరో బిటెక్ విద్యార్థిని బలిగొంది. సీనియర్ విద్యార్థినులు, ఓ లెక్చరల్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన కడప జిల్లా బద్వేలు మండలం బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీరం జయరామిరెడ్డి కుమార్తె బీరం ఉషారాణి (19) వాస్మోల్ తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
అవనిగడ్డ/నాగాయలంక, నవంబర్ 18: సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం సంభవించిన దివిసీమ ఉప్పెన నేటికీ ఈ ప్రాంత ప్రజలను వణికిస్తూనే ఉంది. నవంబర్ 19 అంటేనే ఈ ప్రాంత ప్రజలు హడలిపోతారు. 1977వ సంవత్సరం నవంబర్ 19న సంభవించిన ఉప్పెనకు దివిసీమ స్మశానాల దిబ్బగా మారింది. 10 వేల మందిని పొట్టన పెట్టుకున్న ఉప్పెనకు నేటికి 40 ఏళ్ళు. అప్పట్లో భీకరమైన గాలులతోపాటు జోరు వాన దివి వాసుల పాలిట శాపమైంది.