-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబర్ 12: యూనివర్శిటీల్లోని పోస్టుల భర్తీ బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్కు అప్పగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రలో ఎపిపిఎస్సికి, తెలంగాణలో టిఎస్పిఎస్సికి యూనివర్శిటీల బోధన, బోధనేతర సిబ్బంది ఎంపిక బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం అంతవరకూ స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ఎంపిక వ్యవహారంపై అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 10: బిజెపి-తెదేపా మధ్య గత కొద్దికాలం నుంచి నామినేటెడ్ పదవులపై కొనసాగుతున్న మనస్పర్ధలకు తెరపడనుంది. తెదేపాకు ఒక గవర్నర్ పదవి ఇస్తామని చాలాకాలం క్రితం హామీ ఇచ్చిన బిజెపి నాయకత్వం, ఎట్టకేలకు తన హామీ నిలబెట్టుకోనుంది. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే నెలలోపే తెదేపాకు గవర్నర్ పదవి ఇవ్వాలని బిజెపి నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
హైదరాబాద్, అక్టోబర్ 10: ఇటీవల హైదరాబాద్లో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ దందాలో కీలక వ్యక్తులు బెంగుళూరులో ఉన్నట్టు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ దందాలో ముగ్గురు నిందితులు కీలకమని, వీరికోసం ఎన్సిబి అధికారులతోపాటు పోలీస్ యంత్రాంగం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించే కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ నెల 12వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దఅప్పలు, కోడిపులుసు, సర్వపిండి, పచ్చిపులుసు, గుడాలు, దబడం వంటి అనేక తెలంగాణ వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఎం.
హైదరాబాద్, అక్టోబర్ 10: ఇఎస్ఐ ఆసుపత్రుల్లో కార్మికులకు సరైన వైద్యం అందించకపోతే చర్యలు తప్పవని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. తెలంగాణలో ఐదు ఇఎస్ఐ సంచార వైద్యశాలలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇఎస్ఐ డిస్పెన్సరీల స్థాయిని దశలవారీగా పెంచనున్నట్లు ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.
తెలుగు లోగిళ్లు దసరా శోభతో కళకళలాడుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల శోభకు విజయదశమి కొత్త కళను తెచ్చింది. విజయాన్ని అందించే పండుగ దసరా. చెడును చెండాడి...జయకేతనాన్ని ఎగరవేసిన శక్తి ఈ పండుగ ప్రత్యేకత. అన్ని విజయాలకూ అమ్మవారే అసలు కారణమన్నది అందరి విశ్వాసం. ఆ అమ్మవారి దీవెనల కోసం పండువెనె్నల రోజుల్లో, నిండు మనసుతో ఆమెను ఆరాధిస్తారు. అనునిత్యం స్తుతిస్తారు.
ఆధ్యాత్మికతకు ఆలవాలమైన హిమాచల్ప్రదేశ్లోని కులును దేవతల లోయగా పిలుస్తారు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు అంతర్జాతీయంగానూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను చెడుపై మంచి సాధించే విజయంగా భావిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించటానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు.
అదరగొట్టెను ఆనాడు అర్జునుండు
గోవులందోలుకొని పోవు కురుదొరలను
విరట దేశాన వెలిగెను విజయదశమి
మచ్చు చూపించె పాండవ మహిత శక్తి
విజయదశమిని తలపింప విరుచుకుపడె
సింగురణబీరు చీకట్లు చీల్చుకొనుచు
భాద్రపద బహుళ చతుర్థి భానుమూర్తి
లేచుమునె్న శత్రువులన లేపినాడు
సర్వ దేవతాంశాల నుంచి ఒక మహాతేజోపుంజం వచ్చి
ఆదిపరాశక్తిగా ఆవిర్భవించి అహంకరిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన ఈ రోజునే
‘విజయదశమి’గా పండుగ జరుపుకుంటున్నాం.
హైదరాబాద్, అక్టోబర్ 9: వ్యర్థపదార్థాలను సేంద్రీయ ఎరువులుగా మార్చే ప్రక్రియకు టన్నుకు 1500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని, విద్యుత్తు తయారీ ప్రక్రియకూ సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు.