-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
శ్రీకాకుళం, మార్చి 31: శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణుపార్క్కు మార్గం సుగమమైంది. భారత్ - అమెరికాల ఆధ్వర్యంలో కొవ్వాడలో ఆరు వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న అణుపార్కు నిర్మాణానికి సన్నాహాలూ తుది దశకు చేరుకున్నాయి. భూ సేకరణ నిమిత్తం కేంద్ర అణుఇంధన సంస్థ గురువారం రూ.390 కోట్లు విడుదల చేసింది.
హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ (పిఏసి) చైర్పర్సన్గా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు జె గీతారెడ్డిని నియమించినట్టు శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రకటించారు. ఇదే పదవికి అదే పార్టీ నుంచి పోటీపడిన మరో సభ్యుడు టి జీవన్రెడ్డిని కమిటీ సభ్యునిగా నియమించినట్టు స్పీకర్ పేర్కొన్నారు.
విజయవాడ, మార్చి 31: రాష్ట్రంలోని నగరాభివృద్ధి సంస్థలు అనేక సంవత్సరాలుగా అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నగరాభివృద్ధి సంస్థలకు చైర్మన్లను, పూర్తి స్థాయిలో డైరక్టర్లను నియమించింది. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ కొన్ని నగరపాలక సంస్థలకు చైర్మన్లను నియమించినా, బోర్డును ఏర్పాటు చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా సెల్ఫ్గోల్ చేసుకున్నారు. అసెంబ్లీలో లాప్టాప్స్ వంటి ఆధునిక పరికరాలను వాడుతున్నప్పుడు ‘తెర’ పెడితే తప్పేమిటీ?
-మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, మార్చి 31:‘మీ బిడ్డగా..తెలంగాణ ముఖ్యమంత్రిగా చెబుతున్నా..ఎవరేమన్నా, ఎవరు అడ్డుకున్నా మా ప్రస్థానం ఆగదు. ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించి చూపిస్తాం.మూడేళ్లలో దాదాపు 50-60 శాతం పనులు పూర్తవుతాయి. ఐదేళ్లలో వంద శాతం పూర్తవుతాయి.ప్రాజెక్టులను సందర్శిస్తాను.ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాను. బడ్జెట్లో ప్రాజెక్టులకు 25వేల కోట్లు కేటాయించాం.
హైదరాబాద్, మార్చి 31: తెలంగాణలోని మూడు జిల్లాల్లో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా పరిథిలోని ఔటర్రింగ్రోడ్డుపై లారీకి నిప్పంటుకోవడంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నవారిపైనుంచి మరోలారీ దూసుకువెళ్లడంతో ముగ్గురు మరణించారు.
హైదరాబాద్, మార్చి 31: నగర పర్యావరణ పరిస్ధితులను విధ్వంసం చేసే భవనాల క్రమబద్ధీకరణ స్కీంను (బిఆర్ఎస్) అనుమతించమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 146ను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జిహెచ్ఎంసిలో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ ఈ జీవోకు చేసిన సవరణలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్లో మహిళా సంక్షేమం, అవకాశాలు, భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన సీనియర్ అధికారులతో మహిళా సంక్షేమంపై చర్చించారు.
హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్కు రానున్న రెండు మూడేళ్లు ఆర్థిక బాధలు తప్పవని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. హైదరాబాద్ సచివాలయంలో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్కు 2019 వరకూ ఆర్థిక లోటు ఉంటుందని చెబుతోందని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్, మార్చి 31: ‘‘తెలంగాణ రైతులు బతకాలి, ఆంధ్ర రైతులు బతకాలి. బతుకు.. బతికించు అనేది తెలంగాణ నైజం, చంద్రబాబు నాకు మిత్రుడే, ప్రాజెక్టులపై వివరాలతో పెన్డ్రైవ్ పంపిస్తాను, గోదావరి జలాలు తెలంగాణ ఎంత ఉపయోగించుకున్నా కనీసం మరో రెండువేల టిఎంసిలు సముద్రంలో కలుస్తాయి, ఆంధ్ర రైతులకు మేలు జరిగే విధంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటే మంచిదే’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు.