-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయవాడ, ఫిబ్రవరి 26: వంశధార రెండో దశ పనులు సత్వరం పూర్తయ్యేందుకు గాను రూ.1616 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇలా ఉండగా, హంద్రీ-నీవా పనులను ఎట్టి పరిస్థితుల్లో జూలై నెలాఖరుకు పూర్తిచేయాలని సిఎం చంద్రబాబుఆదేశించారు. కుప్పం నియోజకవర్గానికి జూలై నెలాఖరుకు నీటిని అందించాలని కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఈ ఏడాది చివరినాటికి చాలా గ్రామాలకు మంచినీళ్లు అందించేలా కార్యాచరణ రూపొందించుకుని, భగీరథ పనుల్ని పరిగెత్తించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆదేశించారు. తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోలతో సమన్వయం కుదుర్చుకుని పంప్హౌజ్, పైప్లైన్లు తదితర ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ఒకేసారి 36మంది సివిల్ సర్వీసెస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఐపీఎస్ అధికారుల పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజీవ్ రతన్, సివి ఆనంద్లకు అదనపు డిజీలుగా పదోన్నతి కల్పించారు. విక్రంసింగ్ మాన్, ఆర్బి నాయక్, బి. మల్లారెడ్డి, టి మురళీ కృష్ణ, ఎం. శివప్రసాద్లకు ఐజీలుగా పదోన్నతి లభించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎపి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ 1994 యాక్ట్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయవచ్చు అని చట్టంలో చేర్చారు. దీనివల్ల 18వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 26: కృష్ణానది పుష్కరాలను నదుల అనుసంధానానికి సంకల్పంగా స్వీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు.
విజయవాడ, ఫిబ్రవరి 26: బ్రిటీష్ కాలంలో సముద్రంలో ఉచితంగా లభించే ఉప్పుకు పనే్నమిటంటూ ప్రజల నుంచి తీవ్ర నిరసనలు పెల్లుబికి ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం చేపట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా నదుల్లో కొట్టుకొచ్చే ఇసుక సామాన్యులకి లభించడం దుర్లభంగా మారుతోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: రానున్న బడ్జెట్లో విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమ శాఖలకే పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రెండు రోజులుగా ఆయన వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో చర్చలు జరపుతూ బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు వెల్లడించిన ఆస్తులు కాకుండా బినామీ పేర్లతో ఉన్న ఆస్తులనూ వెంటనే అటాచ్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను కోర్టుకు వెల్లడించకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టును కూడా మోసం చేయాలని చూసిందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపుల ప్రమాదం పొంచి ఉంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీ మారిన సంగతి తెలిసిందే. జగన్కు బంధువైన భూమానే పార్టీ వీడటంతో, పార్టీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించనున్నారన్న ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 26: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్ దళితుడు కాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించిన నివేదికలో స్పష్టం చేసింది.