S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/17/2016 - 08:34

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతున్నారా? ఈ అంశంపై ఆలోచిస్తున్నామని దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. దేవాదాయ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ రామచంద్రమోహన్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి చర్చించిన సందర్భంలో ఆయన ఈ విషయం చెప్పారు.

02/17/2016 - 08:31

కర్నూలు: సియాచిన్ మంచు పర్వతాల్లో వీర మరణం పొందిన సైనికుడు ముస్తాక్ అహ్మద్(32) అంత్యక్రియలు ముస్లింల సంప్రదాయం ప్రకారం మంగళవారం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు అమర జవానుకు తుది వీడ్కోలు పలికారు.

02/17/2016 - 07:22

హైదరాబాద్:ప్రపంచ సవాళ్లకు భారత్ సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా భారత్‌కు అంతా అనుకూలమేనని,అభివృద్ధి చెందిన దేశాల వైఫల్యాలే భారత్‌కు పాఠాలు అవుతాయని చెప్పారు. దక్షిణాసియా దేశాలకు ఆంధ్ర ముఖద్వారంగా ఉంటుందని చెప్పారు. ముంబైలో జరిగిన మేక్ ఇన్ ఇండియా సదస్సులో చంద్రబాబునాయుడు సోమవారం నాడు ప్రసంగించారు.

02/16/2016 - 02:53

నిజామాబాద్, ఫిబ్రవరి 15:బీడీ కట్టలపై రెట్టింపు సైజులో పుర్రె గుర్తు, క్యాన్సర్ బొమ్మలను ముద్రించాలన్న కేంద్ర నిర్ణయానికి నిరసనగా కంపెనీల యాజమాన్యాలు సోమవారం నుంచి సమ్మెకు దిగాయి. రాష్టమ్రంతటా బీడీ కంపెనీలు మూతపడటంతో లక్షలాది మంది కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

02/16/2016 - 02:53

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి, విజయోత్సవాలతో అసెంబ్లీకి వచ్చే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిపే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

02/16/2016 - 02:52

హైదరాబాద్, ఫిబ్రవరి 15: బడ్జెట్ ప్రతిపాదనలపై సాగునీటి శాఖ అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం సమీక్ష జరిపారు. ఈ సంవత్సరంలో వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు ఇవ్వగలిగే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని అన్నారు.

02/16/2016 - 02:48

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రో), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆంగ్రోవైస్-్ఛన్సలర్ డాక్టర్ అల్లూరి పద్మరాజు తెలిపారు. ఆంగ్రో వైస్-్ఛన్సలర్‌గా పద్మరాజు పదవీ విరమణ చేయడంతో సోమవారం ఆయనకు యూనివర్సిటీ సిబ్బంది సన్మానం చేశారు.

02/16/2016 - 02:47

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఏకీకృత సర్వీసు రూల్స్ వివాదం పరిష్కారానికి కేంద్ర హోం శాఖ అధికారులను కలిసేందుకు ఫ్యాప్టో నేతలు కత్తి నర్సింహారెడ్డి, సెక్రటరీ జనరల్ పి పాండురంగ వరప్రసాదరావు, కోచైర్మన్ పి బాబురెడ్డి ఢిల్లీ వెళ్లారు. సర్వీసు రూల్స్ వివాదం పరిష్కార కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, న్యాయసలహాదారుడు కూడా ఢిల్లీ వెళ్లారు.

02/16/2016 - 02:46

ఏలూరు, ఫిబ్రవరి 15: అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిలను అరెస్టుచేసి ఏలూరులోని జిల్లా జైలుకు తరలించటం, వారు బెయిల్ కోసం, సిఐడి పోలీసులు వారి కస్టడీ కోసం న్యాయస్ధానంలో పిటిషన్లు దాఖలు చేయటం తెల్సిందే. సోమవారం మధ్యాహ్నం వీటికి సంబంధించి వాదనలు జరిగాయి. అయితే నిర్ణయాన్ని మంగళవారం ఉదయం వెలువరిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎ హరిహరనాథశర్మ వాయిదావేశారు.

02/16/2016 - 02:46

శ్రీకాళహస్తి: రష్యా దేశానికి చెందిన 30మంది భక్తులు సోమవారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. విభూది, కుంకుమ ధరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆలయంలోని ప్రతి శివలింగాన్ని భక్తితో, ఆసక్తితో దర్శించుకున్నారు. ఆలయ విశేషాల గురించి వారు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Pages