-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్టస్థ్రాయి రిక్రూట్మెంట్ బోర్డు 9281 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 4 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు శనివారం పేర్కొంది. ఇప్పటి వరకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు 1,59,604 దరఖాస్తులు వచ్చాయని తెలిపింది.
హైదరాబాద్, జనవరి 23: ప్రపంచస్థాయి నగరలతో సమానంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్ ప్రణాళిక ఖరారు చేసామని, మహాయజ్ఞంలో అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జనవరి 23: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష భగ్నమైంది. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాల జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల ఆమరణ దీక్ష శనివారంతో ఐదోరోజుకు చేరింది. విద్యార్థులకు షుగర్ లెవెల్ తగ్గిపోయిందని, ఆరోగ్యం క్షీణించిందని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు.
విజయవాడ, జనవరి 23: ప్రస్తుత న్యాయ విచారణ పద్ధతుల్లో వేగవంతమైన మార్పు తెచ్చి, వినియోగదార్లకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కోర్టులు, పోలీసు విధానాలు, ప్రజల ఆకాంక్షలకు మధ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారధిగా పనిచెయ్యాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల తొలి సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
హైదరాబాద్, జనవరి 23: బెంగళూరు శివార్లలో తలదాచుకుంటున్న కరడుగట్టిన గజ ఉగ్రవాది అస్ఘర్ స్థావరంపై తెలంగాణ పోలీసులు శనివారం దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించారు. 2008 అహమ్మదాబాద్ పేలుళ్ల కేసులో కీలక సూత్రధారి అస్ఘర్ ఇండియన్ ముజాహిదీన్ సంస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ టీఆర్ఎస్ కైవసం కావడం ఖాయమైపోయిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, శేరిలింగంపల్లి తెదేపా నేత బండి రమేశ్ తదితరులు రాష్ట్రమంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణభవన్లో ఆపార్టీ నేతలు గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కేకే, డీఎస్ తదితరులు నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం పాఠశాలలో ఖో..ఖో.. ఆడుతూ భద్రాచలం అనే విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఉపాధ్యాయులు భద్రాచలంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురుగా ఢీకొనడంతో సంఘటన చోటుచేసుకున్నది.
హైదరాబాద్, జనవరి 22: రాష్ట్రంలో వంతెనలు, టనె్నళ్ల నిర్మాణాలను 11 అంచెలుగా చేపట్టి 25 నెలల్లో పూర్తిచేస్తామని చైనా కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కెసిఆర్తో భేటీ అయ్యారు. తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో వీటిని పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
విజయవాడ, జనవరి 22: ప్రతి ఏటా మూడు సీజన్లలో 120 రకాల పంటలు పండించే 33వేల ఎకరాల భూములను అదిరించి, బెదిరించి కైవసం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను విదేశీ కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోందంటూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్త పండలనేని శ్రీమన్నారాయణ ధ్వజమెత్తారు.