S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2016 - 02:05

హైదరాబాద్, జనవరి 21: గనుల తవ్వకం, కార్యకలాపాలను శాటిలైట్ ఇమేజరీ ద్వారా పర్యవేక్షించేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మధ్య గురువారం ఇక్కడ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుకు సుదూర్ దృష్టి అని నామకరణం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా డ్రైవ్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సుభాశ్ చంద్ర తెలిపారు.

01/22/2016 - 02:05

విజయవాడ (క్రైం), జనవరి 21: ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులపై రెండో రోజు ఏసిబి దాడులు కొనసాగాయి. విజయవాడలోని రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరచిన అధికారులు నివ్వెరపోయారు. గుట్టలు, గుట్టలుగా బంగారు, వెండి నగలతోపాటు ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సీజ్ చేసిన బంగారం, వెండి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా.

01/22/2016 - 07:58

చిలమత్తూరు, జనవరి 21: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి గురువారం ఉదయం సైబీరియన్ కొంగలు చేరుకున్నాయి. వాస్తవానికి ఇవి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో వెనుదిరుగుతాయి. అయితే గ్రామంలోని చెరువులో నీళ్లు లేకపోవడంత గత రెండేళ్లుగా రాలేదు. ఈసారి ఆలస్యంగానైనా కొంగలు వచ్చాయని సంబరపడుతున్నారు.

01/22/2016 - 01:26

హైదరాబాద్, జనవరి 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీ మినహా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, బిజెపిల్లో ఆగ్రహాజ్వాలలు రగిల్చింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో పార్టీ కార్యాలయాలు అట్టుడుకాయి. టిక్కెట్లు రాని ఆశావాహులు ఆందోళనలకు దిగి నేతలపై కనె్నర్ర చేశారు.

01/22/2016 - 01:30

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దిగివచ్చింది. గురువారం నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది.

01/22/2016 - 01:21

హైదరాబాద్, జనవరి 21: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రధాన సమస్యగా మారిన గోదావరి జలాల వినియోగంపై గురువారం హైదరాబాద్‌లో జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడిగా, వేడిగా జరిగింది. బోర్డు చైర్మన్ రామ్‌శరణ్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాలు తమకున్న హక్కులు, అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.

01/22/2016 - 01:18

హైదరాబాద్, జనవరి 21: రక్షణ రంగ ఉత్పత్తులు, విమానయాన రంగానికి సంబంధించి ఉత్పత్తులు చేస్తున్న లాక్‌హీడ్ కంపెనీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దావోస్ పర్యటన సందర్భంగా మూడో రోజు పలువురు ప్రముఖులు, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

01/22/2016 - 01:18

హైదరాబాద్, జనవరి 21: కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాలుగానూ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అపారఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు, సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం రాష్ట్రానికి ఉందని, అలాగే వీటన్నింటినీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు.

01/21/2016 - 18:59

హైదరాబాద్‌: కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎట్టకేలకు గురువారం జరిగింది. బోర్డు ఛైర్మన్‌ రామ్‌శరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు నియంత్రణ, నిబంధనల్లో కొన్ని సవరణలు చేసి వాటిని కేంద్ర జలవనరులశాఖకు పంపించాలని నిర్ణయించారు.

01/21/2016 - 16:43

చెన్నై:తమిళనాడులో కరడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తరాదిలో ఏడు బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ మహ్మద్ అలీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. లక్నో కోర్టులో హాజరుపరిచి వేలూరుకు తీసుకొస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ దగ్గర రైలులో నుంచి దూకి సయ్యద్ తప్పించుకున్నాడు.

Pages