S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/18/2016 - 13:22

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నటుడు, నందమూరి బాలకృష్ణ ఈ ఉదయం సమావేశమయ్యారు. క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన నిర్మాణాలను బీఆర్‌ఎస్ కింద క్రమబద్దీకరించాలని సీఎంను బాలయ్య కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న క్యాన్సర్ ఆస్పత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తదని సీఎం తెలిపారు.

01/18/2016 - 12:40

హైదరాబాద్: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌,భువనేశ్వరి, బ్రాహ్మిణిలు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర టీడీపీ నేత మాగంటి గోపినాథ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు.

01/18/2016 - 06:44

రాజమహేంద్రవరం, జనవరి 17: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు జూలై 14న రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29మంది మృతి చెందిన సంఘటనపై సోమవారం నుండి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ న్యాయ విచారణ ప్రా రంభం కానుంది. తొక్కిసలాటలో అక్కడికక్కడే 27మంది మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందిన సంగతి విదితమే.

01/18/2016 - 06:23

కూచిపూడి, జనవరి 17: కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల మందు వికటించి మూడు రోజుల పసికందు మృతి చెందింది. పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయ్యంకి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తమ బాబుకు పోలియో చుక్కలు వేసినట్లు పసికందు తల్లిదండ్రులు తెలిపారు. ఈ నెల 15న బండ్రెడ్డి కుమారి మొవ్వ పిహెచ్‌సిలో కుమారుడికి జన్మనిచ్చింది.

01/18/2016 - 06:20

తిరుపతి, జనవరి 17: రేణిగుంట విమానాశ్రయం మేనేజర్ రాజశేఖర్‌పై జరిగిన దాడి కేసులో 19మంది నిందితుల్లో ఒకరైన కడప జిల్లా రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని, మరో నిందితుడు బియ్యపు మధుసూధన్‌రెడ్డిని శనివారం అర్థరాత్రి చెన్నైలోని విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం రేణిగుంట మండలంలోని గాజులమండ్యం పోలీస్టేషన్‌కు తరలించారు.

01/18/2016 - 06:18

హైదరాబాద్, జనవరి 17 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రతిపాదించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సిఎం చంద్రబాబు సూచనల మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్ తదితరులతో సమీక్షిస్తున్నారు. అన్నీ సవ్యంగా కొనసాగితే ఫిబ్రవరి రెండోవారం లేదా మూడోవారంలో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

01/18/2016 - 06:43

హైదరాబాద్, జనవరి 17: బిజెపి సీనియర్ నాయకుడు, సిక్కిం మాజీ గవర్నర్ వి. రామారావు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడున్నారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్న రామారావు స్థానిక అపొలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1935 సంవత్సరం డిసెంబర్ 11న కృష్ణా జిల్లా మచిలిపట్నంలో జన్మించిన రామారావు బిఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు.

01/18/2016 - 06:45

విజయవాడ, జనవరి 17: రాష్ట్రంలో కరవుకు పాతరేసేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఎన్ని కష్టాలెదురైనా, ఆర్ధిక పరిస్థితి సహకరించకున్నా భగీరథ ప్రయత్నాన్ని ఆపేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తన ముందున్న లక్ష్యమన్నారు.

01/17/2016 - 07:12

శ్రీశైలం, జనవరి 16:సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

01/17/2016 - 07:03

చంద్రగిరి, జనవరి 16 : ‘మనం చేసే కర్మ ఫలాలే భవిష్యత్తు తరాలు అనుభవిస్తామని స్వామి వివేకానంద చెప్పిన సూక్తి అక్షర సత్యం. అందుకే ఇప్పుడు మనం మంచి పనులు చేస్తే అవి భవిష్యత్తు తరాల వారికి అంది మేలు చేస్తాయ‘అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సంబరాలు నారావారి పల్లెకు విచ్చేసిన సిఎం చంద్రబాబు నాయుడు శనివారం తిరుగు ప్రయాణం అవడానికి ముందు విలేఖరులతో మాట్లాడారు.

Pages