-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విశాఖపట్నం, జనవరి 4: విశాఖలో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు సిఐఐ ఆధ్వర్యంలో జరగనున్న ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఈ సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ సదస్సు ప్రారంభమై, 12వ తేదీ సాయంత్రం ముగుస్తుంది.
న్యూఢిల్లీ, జనవరి 4: భారత్-పాక్ మధ్య మరో వారంలో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల చర్చలు పూర్తిగా సందిగ్దంలో పడ్డాయి. చర్చలు జరిగే అవకాశం లేదన్న వాతావరణమే కనిపిస్తోంది. జైషె మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులు పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి ఒడిగట్టినందుకు నిరసనగా బిజెపి సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఈమేరకు నిర్ణయం తీసుకోవచ్చంటూ సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ, జనవరి 4: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచే సాధ్యమైనంత త్వరగా పరిపాలన సాగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పురపాలక మంత్రి పి నారాయణ ప్రకటించారు. తొలుత మంగళగిరి శివారు అమరావతి టౌన్షిప్లో తాత్కాలిక భవనాల నిర్మాణం చేపడదామని అనుకున్నామని, అయితే ఆ ప్రాంతం ఒక మూలగా ఉన్నందున ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు చెప్పారు.
గుంటూరు, జనవరి 4: కాల్వలు సమృద్ధిగావున్న ఆంధ్ర రాజధాని అమరావతి, విజయవాడ, తెనాలి ప్రాంతాలను ప్రపంచంలోనే నెంబర్వన్గా తీర్దిదిద్దే అవకాశం ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. 3వ విడత జన్మభూమిలో భాగంగా సోమవారం తెనాలి గ్రామసభలో మాట్లాడారు. దుబాయ్, సింగపూర్ దేశాల్లో సముద్రాన్ని పూడ్చి నగరాలు నిర్మించారని, అయితే ఆంధ్ర రాజధాని అమరావతికి మంచినీటి కాలువలు చుట్టూ ఉన్నందున అద్భుత రాజధాని నిర్మించవచ్చన్నారు.
విజయవాడ, జనవరి 4: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన విజయవాడ కల్తీ మద్యం కేసులో నిందితుడైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్ను స్థానిక మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈనెల 6లోగా స్థానిక పోలీస్టేషన్లో హాజరై విచారణకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ వర్శిటీల్లో ప్రొఫెసర్లు దాదాపు 90 శాతంమంది రెండేళ్లలో పదవీ విరమణ కానుండటం రెండు ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతోంది. తెలంగాణ వర్శిటీల్లో బోధన సిబ్బంది పదవీకాలం 60ఏళ్లు, కాగా ఆంధ్రలో వర్శిటీల్లో బోధన సిబ్బంది పదవీకాలం 62 ఏళ్లుగావుంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ 58 ఏళ్లు కాగా, ఆంధ్రలో 60 ఏళ్లుగా ఉంది.
కడప, జనవరి 4: కడప సెంట్రల్ జైలులో అసాంఘిక కార్యకలాపాలు యధేచ్చగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. వివిధ నేరాల్లో శిక్షలుపడి జైలుశిక్ష అనుభవిస్తున్న సాధారణ ఖైదీలపై ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు బయట నుంచి మద్యం, కావాల్సిన ఆహారం బాహటంగానే వెళుతోంది.
హైదరాబాద్ :పాలమూరు ఎత్తిపోతల, పెన్గంగ్ ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాల పనుల టెండర్ల ప్రక్రియ రెండువారాల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. జూన్నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీరు చేరాలని ఆదేశించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న అన్ని సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ విచ్చేసిన ఆయనకు బాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.41వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు.
పంజాబ్ : పంజాబ్లోని పఠాన్కోట ఎయిర్బేస్ వైమానికి స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణలొదిలిన కమాండో గురుసేవక్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హర్యానాలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. భారత్మాతాకి జై అంటూ ప్రజలు నినదిస్తూ వీడ్కోలు పలికారు. ఆరువారాల క్రితమే వివాహం చేసుకున్న గురుసేవక్ సింగ్ సెలవుల అనంతరం విధుల్లోకి చేరి ముష్కరులను ఎదుర్కొనే దాడిలో నేలకొరిగారు.