-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన డాక్టర్ పసుపులేటి శరత్శ్చంద్ర బాబు ఒక కోటి నూట పదహారు రూపాయలు, పసుపులేటి వెంకటశశిధర్ పదకొండు లక్షల నూట పదహారు రూపాయలు విరాళపు చెక్కులను విడివిడిగా రెండు డీడీలను టీటీడీ అదనపు ఈఓ ఎవి ధర్మారెడ్డికి మంగళవారం అన్నమయ్య భవన్లో అందజేశారు.
ధర్మపురి, మార్చి 10: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో సనాతన సంప్రదాయరీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా మంగళవారం జరిగిన శ్రీ ఉగ్రనారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలలో భాగస్వాములయ్యేందుకు అశేష భక్తజనం క్షేత్రానికి తరలివచ్చారు.
రాజమహేంద్రవరం, మార్చి 10: నియంత్రణ, నిబంధనల మధ్య రాష్ట్రంలో మళ్లీ నదీ పర్యాటకం మొదలు కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసుకుని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నదీ పర్యాటకానికి శ్రీకారం చుడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం దరిమిలా రాష్ట్రంలో మొత్తం నదీ పర్యాటకమంతా నిలిచిపోయింది.
తిరుపతి: తిరుమలలో శ్రీవారికి గత ఐదు రోజులుగా జరుగుతున్న తెప్పోత్సవాలు సోమవారంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు సర్వాలంకార భూషితుడై తెప్పపై అధిరోహించి శ్రీవారి పుష్కరిణిలో ఏడుచుట్లు వేసి విహరించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలతో భక్తిశ్రద్ధలతో చేసిన గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది.
భద్రాచలం టౌన్: భద్రాద్రి రామయ్య పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. వసంతోత్సవం వేళ రామయ్యపై శాస్త్రోక్తంగా అర్చకులు వసంతం చల్లడంతో రామయ్య పెళ్లికొడుకయ్యాడు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డోలోత్సవం, వసంతోత్సవాన్ని సోమవారం ఆహ్లాదకరంగా నిర్వహించారు.
ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రం దిగువ అహోబిలంలో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పూజల అనంతరం ఆలయం నుంచి ఊరేగింపుగా రథం వద్దకు తోడ్కొనివచ్చారు. రథంలో స్వామివార్లను ఆశీనులనుజేయించిన అనంతరం హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
అనంతపురం, మార్చి 9: దేశంలో హిందూత్వ రాజ్య స్థాపనే ప్రధాన అజెండాగా కేంద్రంలోని బీజేపీ మత ప్రాతిపదికన విభజించేందుకు కుట్ర పన్నుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. అనంతపురం నగరంలో సోమవారం సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా లౌకికరాజ్య పరిరక్షణ-యునైటెడ్ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ధర్మపురి, మార్చి 9: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, సోమవారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్ట్రేతర ప్రాంతాల నుండి జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది.
హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన అనంతరం విద్యాశాఖ నిధుల కోసం, ఉన్నత విద్యా మండలి ఏర్పాటుకు, తెలుగు అకాడమీ విభజనకు కయ్యానికి కాలుదువ్విన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు కొత్త వైరానికి కాలుదువ్వుతున్నా యి. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్శిటీలు ఆఫర్ చేస్తు న్న దూర విద్య కోర్సులను తెలంగాణలో రద్దు చేస్తున్నాయి.
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఆదివారం బ్రహ్మాండ నాయకుడైన స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదివారం రాత్రి శ్రీవారి పుష్కరిణిలో తెప్పపై విహరించారు. ఈ సందర్భంగా భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారు తెప్పపై ఐదుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను కరుణించారు.