S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/09/2020 - 05:19

నారాయణపేట, మార్చి 8: జాతి నిర్మాణంలో యువత కీలకం కావాలని, నేటి యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేందుకు సన్నద్ధులు కావాలని హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మహిళలంతా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు.

,
03/09/2020 - 04:32

లేపాక్షి, మార్చి 8: లేపాక్షి వైభవ్-2020 ఉత్సవాల్లో భాగంగా గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యం తం ఆహుతులను అలరించాయి. అనంతపురం జిల్లా లేపాక్షిలో కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో టూరిజం శాఖ రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో లేపాక్షి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

,
03/09/2020 - 04:29

హైదరాబాద్: స్ర్తి, పురుష లింగ వివక్ష లేని ప్రపంచాన్ని సృష్టించాలని, విద్యతో పాటు ఆర్థిక స్వావలంబన, సాధికారత కల్పించిన నాడే మహిళలకు సమాజంలో సమానత్వం దక్కుతుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ పురుషుల కంటే గొప్పగా రాణిస్తారని అన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలని, వారికి మంచి విద్యాబుద్ధులను నేర్పించాలని ఆయన పేర్కొన్నారు.

03/08/2020 - 05:34

శ్రీశైలం టౌన్: శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం తేదని డ్యాం భద్రతా నిపుణుల కమిటీ చైర్మన్ ఏబి పాండ్య తెలిపారు. శ్రీశైలం డ్యాం భద్రతపై గత మూడు రోజులగా నిపుణుల బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ కమిటీ చైర్మన్ పాండ్య శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం పరిరక్షణకు పలు కీలక సూచనలు చేసినట్లు చెప్పారు.

03/08/2020 - 00:49

హైదరాబాద్, మార్చి 7: విధానాల రూపొందిస్తే చాలదని, వాటి అమలు కూడా చాలా ముఖ్యమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. అందుకోసం అధికారుల పనితీరు, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంత్యోదయ నినాదాన్ని అమలు చేయాలని, పథకాలను ప్రజా ఉద్యమాలుగా మలచాలని ఆయన స్పష్టం చేశారు. అపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలుగుతామని ఉప రాష్ట్రపతి చెప్పారు.

03/08/2020 - 00:44

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మార్చి 7: వచ్చే ఉగాది నుండి కనకదుర్గ అమ్మవారి అంతరాలయం దర్శనం చేసుకునే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం జరిగిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం ఈవో ఎంవీ సురేష్‌బాబు 10 అంశాలతో అజెండాను రూపొందించి ప్రవేశ పెట్టారు.

03/08/2020 - 00:42

తిరుపతి, మార్చి 7: తిరుపతి మహంత్ మఠం అద్భుతాలకు, రహస్యాలకు నిలయంగా ఉంటుందన్న సత్యం తాజాగా వెలుగుచూసింది. మహంత్‌లు బసచేసే ప్రత్యేకగదిలో ఒక రహస్య స్వరంగ మార్గం శనివారం వెలుగుచూసింది. ఫిట్‌మెన్‌గా నియమితులైన శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తనిఖీలకు వెళ్లడంతో ఈ వాస్తవం ప్రపంచానికి తెలిసివచ్చింది.

,
03/06/2020 - 07:02

తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వరాహ పుష్కరిణిలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయం సంధ్యవేళ చల్లని వాతావరణంలో తెప్పపై విహరిస్తున్న స్వామివారిని తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. 5రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాల్లో తొలిరోజు స్వామివారు సీతారామలక్ష్మణ సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

03/06/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 5: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్, చెన్నై నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మార్చి 6వ తేదీ 29 వరకూ చెన్నై నుంచి సికింద్రాబాద్‌కు (06059-06060) వరకు వచ్చిపోయేందుకు 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి (07429) కాకినాడకు (07053) మరో 4 రైళ్లను నడుపుతున్నారు.

03/06/2020 - 06:31

హైదరాబాద్: సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఇక్కడ స్వగృహంలో కన్ను మూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ఆయన గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్య కారణాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక్కడ

Pages